Christmas 2021: క్రిస్మస్ కు ముందు రాత్రి వేళ చర్చిలో ప్రార్థనల ప్రత్యేకతలేంటో తెలుసా...

క్రిస్మస్ కు ముందు రాత్రి వేళ చర్చిలో ప్రార్థనల ప్రత్యేకతలేంటో తెలుసా...

క్రైస్తవులంతా ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ రోజుగా జరుపుకుంటారు. అయితే దీనికి ముందు క్రిస్మస్ ఈవ్ అనే వేడుకను జరుపుకుంటారు. డిసెంబరు 25న ఉత్సవాలు జరుగుతాయి, అయితే కొన్ని వేడుకలు డిసెంబర్ 24 రాత్రి నుండి ప్రారంభమవుతాయి.

Christmas : What is Midnight Mass? Why Do People Go To Church on Christmas Eve in Telugu

అందులో ఒకటి డిసెంబర్ 24న జరిగిన అర్ధరాత్రి చర్చిలో జరగుతుంది. దీన్నే మిడ్ నైట్ మాస్ అంటారు. ఈ మాస్ సందర్భంగా యేసును స్మరించుకుంటూ పాటలు పాడతారు. ఇది రోమన్ కాథలిక్ కాలం నుండి ప్రారంభమైంది. 2009 నుండి, పోప్ అర్ధరాత్రి వేళ అంటే రాత్రి 10 గంటల నుండి వేడుకలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు రాత్రి 10 గంటలకు మాస్ జరుపుకుంటారు. మిడ్ నైట్ మాస్ వేడుకల్లో భాగంగా యేసును స్తుతిస్తారు.

Christmas : What is Midnight Mass? Why Do People Go To Church on Christmas Eve in Telugu

మిడ్ నైట్ మాస్
క్రిస్మస్ పండుగ రోజున మిడ్ నైట్ మాస్ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇది పవిత్రమైన కమ్యూనియన్ వేడుకను కలిగి ఉంటుంది. మిడ్ నైట్ మాస్ అనేది క్రిస్టమస్ టైడ్ యొక్క మొదటి ప్రార్థన. ఇది అర్థరాత్రి వేళ ప్రారంభమవుతుంది. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మిడ్ నైట్ మాస్ లేదా సర్వీస్ ఆఫ్ వర్షిప్ వేడుక.

Christmas : What is Midnight Mass? Why Do People Go To Church on Christmas Eve in Telugu

మిడ్ నైట్ మాస్ యొక్క సంప్రదాయం ప్రారంభంలో 381-384 మధ్య పవిత్ర భూమికి తీర్థయాత్రకు వెళ్లిన గెలీషియన్ మహిళ ఎగేరియా ద్వారా వివరించబడింది. బెత్లె హెమ్ లో, జెరూసలెం యొక్క ప్రారంభ కాథలిక్కులు అర్ధరాత్రి సమయంలో జాగరణతో క్రిస్మస్ రహస్యాన్ని ఎలా జరుపుకున్నారనే అని ఎగేరియా గమనించింది.

ఈ రాత్రంతా జాగరణ సంప్రదాయాన్ని పాశ్చాత్య ప్రపంచం 430లో సెయింట్ మేరీ మేజర్లోని బాసిలికాలో పోప్ సిక్ట్స స్-3 ఆధ్వర్యంలో చేపట్టింది.

ఈ క్రిస్మస్ సాయంకాలం ప్రార్థనా సంప్రదాయాన్ని రోమన్ కాథలిక్ చర్చి, ఆంగ్లికన్ కమ్యూనియన్ మరియు లూథరిన్ చర్చిలు అనుసరిస్తాయి. 12వ శతాబ్దానికి క్రిస్మస్ రోజున 3 మాస్ లను జరుపుకోవడానికి ఫాదర్లకు మంజూరు చేయడంతో ఈ అర్థరాత్రి మాస్ యొక్క ప్రజాదరణ మరింత పెరిగింది.

వీటిని మూడు దశలలో అంటే నిర్ణయించిన సమయాలలో జరుపుకోవాలి. ఇవి అర్థరాత్రి, తెల్లవారుజామున మరియు పగలు జరుపుకోవాలి. ముందుగా భక్తి గీతాలతో హై మాస్ గా పరిగణించబడతాయి. ఇవి తెల్లవారు జాము వరకు కొనసాగుతాయి.

అర్ధరాత్రి మాస్ ఆచారం రోమన్ క్యాథలిక్ చర్చి చాలా కాలంగా అనుసరించే సంప్రదాయం. అయితే, 2009 నుండి మాస్ ను అర్థరాత్రి కాకుండా రాత్రి 10 గంటలకు పోప్ జరుపుకుంటారు.

ఈ ఆచారం యొక్క ప్రాముఖ్యత క్షమించడం యొక్క వ్యక్తిగత ప్రాముఖ్యతలో ఉంది. మిడ్ నైట్ మాస్ అనేది లోక రక్షకుడైన యేసు రాక కోసం ఆనందంగా వేచి ఉండే జాగారం. ప్రతి సంవత్సరం ఈ సంతోషకరమైన సందర్భాన్ని జరుపుకోవడానికి అందరూ చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు.

FAQs
క్రిస్మస్ పండుగను ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన ఏసుక్రీస్తు జన్మించినట్లు నమ్ముతారు. అందుకే ఈరోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.

BoldSky Lifestyle

Story first published: Friday, December 24, 2021, 19:12 [IST]
Desktop Bottom Promotion