Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Guru Purnima 2021:గురు పూర్ణిమ రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలో చూసెయ్యండి...!
గురు పూర్ణమి 2021 సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈ మంత్రాలను పఠించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, అంటే వ్యాస మహర్షిన పుట్టిన రోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 2021లో జులై 24వ తేదీన గురుపూర్ణిమ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున గురువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది. ఈరోజున చాలా మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. గురువు భగవంతుని కంటే ఉన్నతమైన వారు అనేక గ్రంథాల్లో చెప్పబడింది. గురువు లేకుండా మనం ఎలాంటి జ్ణానాన్ని పొందలేము. గురువు సహాయం వల్లే మనం విజయం సాధించడానికి మార్గం సులభమవుతుంది.

తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని.. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ణానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్క గురువు తమ శిష్యులకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతాడు. అంతేకాదు విద్యార్థులు విజయం సాధిస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం అనేది శిష్యుల కర్తవ్యం. శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడి పేరు క్రిష్ణద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవానుడిని, గురువు పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే గురుపూర్ణమి రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలి.. ఏమి దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
‘ఓం అవ్యాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఎర్రని దుస్తులు దానం చేయాలి.

వృషభ రాశి..
‘ఓం జీవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
తెల్లని దుస్తులు దానం చేయాలి.

మిధున రాశి..
‘ఓం దివరాయ్ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఆకుపచ్చ రంగులను దుస్తులను దానం చేయాలి.

కర్కాటక రాశి..
‘ఓం వశిష్టాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
క్రీమ్ కలర్లో ఉండే దుస్తులను దానం ఇవ్వాలి.

సింహ రాశి..
‘ఓం స్వర్ణకయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. గులాబీ రంగులో ఉండే దుస్తులను దానం చేయాలి.

కన్య రాశి..
‘ఓం హరియే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఆకుపచ్చ మరియు లైట్ ఎల్లో దుస్తులను దానం చేయండి.

తుల రాశి..
‘ఓం వివేకతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఖాదీ దుస్తులను దానం చేయాలి.

వృశ్చిక రాశి..
‘ఓం జీవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
దోతిని దానం చేయండి

ధనస్సు రాశి..
‘ఓం జైత్రే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని విరాళంగా లేదా దానం ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.

మకర రాశి..
‘ఓం గుణినే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
పంచధాతు మరియు బట్టలను దానంగా ఇవ్వండి.

కుంభ రాశి..
‘ఓం దివరాయ్ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఉన్ని బట్టలను దానంగా ఇవ్వండి.

మీన రాశి..
‘ఓం దయసరయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
నీలి రంగు బట్టలను దానంగా ఇవ్వండి.



Click it and Unblock the Notifications