Latest Updates
-
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు
మహాభారతంలో మరచిపోలేని మజిలీలెన్నో...!
మహా భారతంలో ఆసక్తికరమైన ప్రేమ కథల గురించి తెలుసుకుందామా
మహాభారతం అనగానే మనలో చాలా మందికి క్రిష్ణుడు, అర్జునుడు, పాండవులు, కౌరవులు, ద్రౌపది, శకుని, కురుక్షేత్ర యుద్ధం, పాండవుల వనవాసం వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి.

అయితే మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా ఎన్నో మరపురాని, మధురానుభూతి కలిగించే ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ కథలు మాత్రమే బంధాలు, అనుబంధాలు మరపురాని మజిలీలెన్నో కూడా ఉన్నాయి.

పురాణాల ప్రకారం మంచి, చెడుల గురించి వివరించే మహాభారతంలో మనల్ని ఆకర్షించే ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆసక్తికరమైన ప్రేమ కథలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

కన్నయ్య, రుక్మిణి..
పురాణాల ప్రకారం, మహాభారతంలో శ్రీక్రిష్ణ లీలల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వేణు మాధవుడు, రుక్మిణిదేవి ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు సిద్ధపడతారు. అయితే ఇది రుక్మిణి కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టముండదు. ఎందుకంటే కంసుడిని క్రిష్ణుడు హతమార్చడం వల్ల రుక్మిణి సోదరుడు వీరి ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచాడు. దీంతో శ్రీక్రిష్ణుడు రుక్మిణి కుటుంబానికి ఇష్టం లేకున్నా.. తను ప్రేమించిన రుక్మిణి దేవిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుంటాడు. దీంతో రుక్మిణి సోదరుడికి, క్రిష్ణుడి మధ్య వైరం ఏర్పడుతుంది.

అర్జునుడు, చిత్రాంగద..
చిత్రాంగద, మణిపూర్ యువరాణి. ఓ రోజు కావేరీ నదీ ఒడ్డున మణిపూర్ ను అర్జునుడు సందర్శించాడు. అక్కడే అందమైన చిత్రాంగదను చూసి ప్రేమలో పడ్డాడు. అయితే వెంటనే ఆమెకు ప్రేమ ప్రతిపాదనతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఈ విషయం తెలిసిన చిత్రాంగద తండ్రి వీరి వివాహం జరగాలంటే కొన్ని షరతులను విధించాడు. చిత్రాంగద పిల్లలు మణిపూర్ లోనే పెరగాలని మరియు వారే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. ఇందుకు అర్జునుడు కూడా ఒప్పుకుంటాడు. వీరికి బబ్రువాహనుడు జన్మించిన తర్వాత అర్జునుడు భార్య, కుమారులను వదిలి సోదరులతో కలిసి ఉన్నాడు. చిత్రవాహనుడు(చిత్రాంగద తండ్రి) మరణం తర్వాత బబ్రు వాహనుడు ఆ రాజ్యానికి రాజయ్యడు. అంతేకాదు, మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు తన కొడుకు చేతిలో ఓడిపోయాడు.

మరో ప్రేమ కథ..
మరో కథనం ప్రకారం.. అర్జనుడు, సుభద్ర సోదరుడు గద, ద్రోణచార్యుల వద్ద శిక్షణ తీసుకున్నారు. అజ్ణాతవాసం తర్వాత, అర్జునుడు సుభద్ర మందిరానికి చేరుకున్నాడు. అక్కడే సుభద్ర, అర్జునుడి మధ్య ప్రేమ పుట్టింది. అప్పుడు శ్రీక్రిష్ణుడే సుభద్రను అపహరించమని సలహా ఇచ్చి.. వారి వివాహానికి కారకుడయ్యాడు. అయితే సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో తన వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉండేవారు. అయితే ఓ రోజు సుభద్ర తమ వివాహ విషయం గురించి ద్రౌపదికి చెప్పగా.. తను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

భీముని ప్రేమ..
మహాభారతంలో భీముని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో బలవంతుడైన భీముడు నరభక్షకురాలు హిడింబితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హిడింబిలో మార్పు వచ్చింది. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం మాత్రమే కలిసి ఉన్నారు. అయితే అనంతరం భీముడు తనని వదిలి వెళ్లాడు. ఆ తర్వాతే హిడింబి ఘటోత్గటుడికి జన్మనిచ్చింది. తను ఒంటరిగానే తనని పెంచి పెద్ద చేసింది.

దుర్యోదనుడి ప్రేమ..
మహాభారతంలో కౌరవులలో ఒకరైన దుర్యోదనుడు ప్రేమ కథ ప్రత్యేకమైనది. దుర్యోదనుడు ప్రేమించిన భానుమతి కాంబోజ రాజు చంద్రవర్మ కుమార్తె. తను అచ్చం అప్సరసలా ఉంటుంది. అంతేకాదు ఎంతో తెలివైంది కూడా. ఓ రోజు భానుమతి స్వయంవరానికి వెళ్తాడు దుర్యోదనుడు. అక్కడ జరాసంధుడు, శిశుపాలు, రుక్మీలు హాజరవుతారు. అక్కడ భానుమతి జయమాలను ఎవరి మెడలో వేస్తే.. వారే తన భర్తగా మారతారు. ఈ నేపథ్యంలో తను జయమాలతో ముందుకు నడుస్తుండగా.. దుర్యోదనుడు తనను అడ్డుకొని బలవంతంగా తన మెడలో జయమాల వేసేలా ప్రేరేపిస్తాడు. అలా భానుమతిని దుర్యోదనుడు సొంతం చేసుకుంటాడు.

శంతనుడి ప్రేమ..
సత్యవతి పరిమళం శంతనుడిని బాగా ఆకర్షించింది. తన నుండి వచ్చే ఆ సువాసనకు శంతనుడు ఫిదా అయిపోయాడు. ఓ రోజు నదిలోని పడవలో ప్రయాణిస్తుండగా.. తీరం చేరాక తనను నదిని దాటించమని సత్యవతిని కోరాడు. ఇందుకు ఒప్పుకున్న ఆమె శంతనుడిని నది దాటిస్తుంది. అయితే అనంతరం మళ్లీ పడవలో చేర్చమని చెప్పగా.. అందుకూ ఆమె అంగీకారం తెలుపుతుంది. ఈ విధంగా ఆరోజు సంధ్యా సమయం దాకా ఇదే తంతు కొనసాగింది. చివర్లో శంతనుడు సత్యవతికి వివాహ ప్రతిపాదన చేయగా.. తను కూడా అంగీకరించింది. కానీ, తాను తన తండ్రి చెబితేనే.. తను పెట్టిన షరతులకు ఒప్పుకుంటేనే శంతనుడిని వివాహం చేసుకుంటానని చెప్పింది.



Click it and Unblock the Notifications