Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
Makara Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత'ఏడాదిలో మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని గంటల్లో వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-9, వ్యయం-2
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా లభిస్తుంది. మరోవైపు మీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. కొత్త ఏడాదిలో చాలా డబ్బును ఆదా చేస్తారు. ఉత్తరాషాడ నక్షత్రం 2,3,4 మూడు పాదాలు, శ్రవణ నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 రెండు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-2, అవమానం-4
ఈ ‘శుభకృత్' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి
సమాజంలో గౌరవం కంటే కొంత ఎక్కువ అవమానాలే ఎదురవుతాయి. గురు గ్రహం అనుగ్రహంతో ఆదాయం మంచిగా లభించినప్పటికీ.. జీవితంలో సుఖంగా ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి తరపున వారి కోసం ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అలాగే వారి నుండే అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సానుకూల విషయమేటంటే.. ఎన్ని ఖర్చులు పెరిగినా.. అవసరానికి తగిన డబ్బు సమకూరుతుంది.

శని ప్రభావంతో..
ఈ రాశి వారిలో శని గ్రహం ప్రభావం వల్ల చిన్నారులకు తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో కష్టాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా ఈ ఏడాది ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈ ఏడాదిలో మిత్ర విరోధాల వల్ల మీరు ఒంటరిగా మిగిలిపోవచ్చు. నల్లని రంగు వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ తెలుగు నూతన సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని దశ ఉంటుంది. ఈ కాలంలో భారీ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.

రాహువు ప్రభావం వల్ల..
ఈ సంవత్సరం రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ స్థానాలను మారడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావొచ్చు. పెద్ద వయసు వారికి మతిమరుపు వంటి సమస్యలు పెరుగుతాయి. వివాహితులకు సంతానం గురించి కొంత ఆందోళన పెరుగుతుంది. మీ బంధువులతో కొన్ని విషయాల్లో విభేదాలు రావొచ్చు.

కేతు ప్రభావం వల్ల..
ఈ రాశి వారికి ఈ ఏడాది కేతు ప్రభావం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఊహించిన మేరకు ఫలితాలొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. మొత్తం మీద ఈ ఏడాది గురువు, కేతువు గ్రహాల వల్ల మీకు శుభ ఫలితాలు రానున్నాయి.

పరిహారాలివే..
మకర రాశి వారికి ఈ ఏడాది ఏలి నాటి శని దశ కొనసాగుతోంది కాబట్టి.. పరిహారం కోసం తమిళనాడులోని తిరునల్వార్ వెళ్లి శనీశ్వరుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి లేదా మహారాష్ట్రలోని శనిసింగ్నాపురానికి వెళ్లి అభిషేకం నిర్వహించాలి. అదే విధంగా శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు జరిపించాలి. అలా వెళ్లడానికి కుదరని వారు నిత్యం గణపతిని ఆరాధన చేస్తూ.. కనకదుర్గ ఆలయానికి వెళ్లి మంగళవారం, శనివారం రోజున కుంకుమ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications