విశ్వవిజేతగా రికార్డు సృష్టించిన తెలుగు తేజం పివి సింధు..

విశ్వవిజేతగా నిలవడమే కాకుండా భారతదేశం తరపున రికార్డు సాధించిన తొలి మహిళగా పివి సింధు చరిత్ర సృష్టించింది. తన కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా అందుకోలేని అరుదైన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. వరల్డ్ బ్యాడ్మ

పసిడి కోసం పోరాడింది..
కానీ వెండితో వెలిగింది..
అంతకుముందు కాంస్యంతో కవర్ చేసుకుంది..
అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడింది..
చివరికి అనుకున్నది సాధించింది.
"సింధూ"రాన్ని స్వర్ణంగా మార్చేసింది..

PV Sindhu

ఎన్నోఏళ్లుగా స్వర్ణ పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. ఇప్పటికే ఐదుసార్లు ప్రయత్నించింది. వరుసగా రెండుసార్లు కాంస్యాలతోనే కన్విన్స్ అయ్యింది. అంతకుముందు త్రుటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించింది. చివరికి పసిడి పతక లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది పివి సింధు.

అమ్మకు బర్త్ డే గిఫ్ట్..

ఫైనల్ లో విజయం అనంతరం ఉద్వేగంగా మాట్లాడింది. "ఎంత హాయిగా ఉందో చెప్పలేను. ఈ గెలుపు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. గత ఏడాది రజత పతకంతో సరిపెట్టుకున్నా.. అంతకుముందు సంవత్సరం రజతమే వచ్చింది. ఎట్టకేలకు ఈసారి టైటిల్ సాధించా. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్వర్ణం లక్ష్యాన్ని సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలను మాటల్లో చెప్పలేను. ఈ క్షణాలను బాగా ఎంజాయ్ చేస్తా" అని సింధు చెప్పింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికలపై తెలుగమ్మాయి తెగువను చూపింది. క్రికెట్ క్రీడనే ఎక్కువగా ఆరాధించే మన భారతదేశంలో ఏ ఒక్క క్రీడాకారిణికి ఇంతటి ఆదరణ, అభిమానం, అభినందనలు ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ సెట్ చేస్తున్న సింధుకు పిఎం మోడీ మొదలుకొని ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లులతో ముంచెత్తుతున్నారు.

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సాధించాలన్న సత్యాన్ని మన తెలుగమ్మాయి పివి సింధు అక్షరాల నిజం చేసింది. రెండేళ్ల క్రితం తన పసిడి లక్ష్యానికి అడ్డుపడిన ఒకుహరనే ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి రౌండ్ నుండే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 21-7, 21-7 వరుస సెట్లలో సింధు రాకెట్ వేగంతో ఆడింది. దీంతో ఒకుహర నిస్సహాయురాలిగా మారిపోయింది. సింధు అసాధారణ నైపుణ్యానికి, తిరుగులేని అధిపత్యానికి ఇదే గొప్ప నిదర్శనం.

స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు..

విశ్వవిజేతగా నిలవడమే కాకుండా భారతదేశం తరపున రికార్డు సాధించిన తొలి మహిళగా పివి సింధు చరిత్ర సృష్టించింది. తన కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా అందుకోలేని అరుదైన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తొలిసారి స్వర్ణం సాధించి మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది.

12 ఏళ్ల కఠోర శ్రమ..

సింధు విజయం అనంతరం ఆమె తల్లి మాట్లాడారు. "ఆమె 12 ఏళ్ల కఠోర శ్రమ ఫలించింది. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించింది. ఏ ఆటలో అయినా గెలుపు, ఓటములు సహజమే. కానీ ఎన్నో గాయాలు ఆమెను బాగా బాధపెట్టేవి. ఒక్కోసారి చిన్నచిన్న దెబ్బలే అనుకున్నా కనీసం ఏడాది పాటు విరామం తీసుకోవాల్సి వచ్చేంది. ఒలింపిక్స్ కు కొద్దిరోజుల ముందు ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో సుమారు ఎనిమిది నెలలు చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా మొక్కవోని ధైర్యంతో చేతులతో సాధన చేసింది. అప్పుడు తల్లిగా నా మనసు చాలా తల్లడిల్లింది. ఎంత కష్టపడితే ఫలితం అంత తీయంగా ఉంటుందనడానికి ఆమె రియోలో సాధించిన రజత పతకమే ఉదాహరణ.

ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలి..

ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని సింధుకు తొలి నుంచి అలవాటు చేశాం. అందుకే పొరపాట్లను అధిగమించడానికి సింధు ప్రణాళికలు వేసుకుంటుంది. అదే తనని విజయానికి దగ్గర చేశాయి. తన ఆట కోసం స్నేహితుల్ని, సరదాల్ని, అన్నీ వదులుకోవాల్సి వచ్చినా, అన్నీ ఇష్టంగానే వదులుకుంది. ఆమె త్యాగం ఊరికే పోలేదని చెప్పడానికి ఆమె ఇపుడు సాధించిన స్వర్ణమే సాక్ష్యం. " అని సింధు తల్లి చెప్పారు.

Story first published: Monday, August 26, 2019, 13:12 [IST]
Desktop Bottom Promotion