Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Teacher's Day 2020 : ఎందరో గురువులు... అందరికీ వందనాలు...
సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.
మన తొలి ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గురువులకు గురువు. ఆయన ఒక గొప్ప విద్యావేత్త మాత్రమే కాదు ఒక యుగ పురుషుడు. మన దేశ జాతిపితగా భావించే మహాత్మ గాంధీజీనే 'మీరు నా ఉపాధ్యాయుడు' అని కొనియాడారు.

మన సమాజంలో ఇప్పటికీ గురువు అంటే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువులో 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ణానాన్ని తొలగించి, జ్ణానదీప్తిని వెలిగించేవాడే గురువు అన్నమాట.

అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంప్రదాయం మనది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఉపాధ్యాయుల విశిష్టత, ప్రాధాన్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1962 నుండి..
భారతరత్న, భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్. ఆయన జయంతి రోజును పురస్కరించుకుని, సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం 1962 నుండి ఈయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

నోబెల్ బహుమతికి నామినేట్..
‘భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకెళ్లిన గొప్ప పండితులు సర్వేపల్లి రాధాక్రిష్ణన్. ఈయన ఏకంగా 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

గురుశిష్య బంధానికి..
మన దేశంలో మహాభారత కాలం నుండి శ్రీక్రిష్ణార్జునల అసలు సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. మహాత్మ గాంధీజీ కూడా సర్వేపల్లి రాధాక్రిష్ణన్ తనకు క్రిష్ణుడితో సమానమని కొనియాడారు. ‘మీరు నా క్రిష్ణుడు, నేను అర్జునుడిని' అనేవార. అందుకే మన తొలి ప్రధాని పండిట్ నెహ్రు ఈ వ్యాఖ్యల నేపథ్యం నుండే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన చేశారేమో.

సూటిగా, స్పష్టంగా..
మన సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజేసిన ధీమంతుడు, గొప్ప విద్యావేత్త సర్వేపల్లి. తత్వశాస్త్రానికి సాహిత్యాన్ని జోడించిన మహా రచయిత రాధాక్రిష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు.

గురువు ద్వారా..
మహాభారతం యొక్క అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల అంశంలో.. యక్షుడు ‘మనిషి మనిషి ఎలా అవుతాడు'? అని ధర్మరాజును ప్రశ్నిస్తే.. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా' అని బదులిస్తాడట. గురువుకు ఉన్న శక్తి అంతగొప్పది. ఆధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థనా చేస్తాడు. ఆ తర్వాత గురువును స్మరిస్తాడు.

ధర్మం స్పష్టంగా..
ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఏయే లక్షణాలు ఉండాలి.. ఏయే లక్షణాలు ఉండకూడదు.. అలాగే గురువు యొక్క గొప్పదనం గురించి స్కాంద పురాణంలో కూడా వివరించారు.

ఎందరో గురువులు..
గురువులలో కొందరిని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. చాణక్యుడి చేతిలో తయారైన మాణిక్యం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీరఖడ్గం శివాజీ. రామక్రిష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరమే వివేకానందుడు. మన దేశంలో గురుశిష్య శక్తికి వీరు ప్రతీకగా నిలుస్తారు. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది.

గురువును మించిన దైవం లేదు..
అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. వాస్తవానికి మనల్ని ఉన్నత స్థానాలలో చూడాలనే ప్రతి ఒక్క గురువు కోరుకుంటారు. తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారు.
బోల్డ్ స్కై తెలుగు తరపున హ్యాపీ టీచర్స్ డే...



Click it and Unblock the Notifications











