Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
International Women’s Day 2023: నారీ శక్తి పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ఈ ఏడాది ఎవరికొచ్చాయంటే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలను 29 మంది మహిళలకు అందజేయనున్నారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాల్లో అత్యుత్తమ శక్తివంతమైన మహిళల్లో 29 మందిని ఎంపిక చేశారు.

దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు మహిళా దినోత్సవం రోజున నారీ శక్తి పురస్కారాలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
వీరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంభాషించనున్నారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అభివృద్ధి కోసం క్రుషి చేసిన మహిళలు, ముఖ్యంగా బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల సాధికారత కోసం, వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది.

నారీ శక్తి పురస్కారం ఎవరికి..
నారీ శక్తి పురస్కారం అనేది మహిళలు మరియు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ, వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అసాధారణమైన సహకారాన్ని గుర్తించి, మహిళలను గేమ్ ఛేంజర్ గా మరియు సమాజంలో సానుకూల మార్పునకు ఉత్ప్రేరకంగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘నారీ శక్తి' అవార్డుకు ఎంపికైన వారికి సర్టిఫికెట్ తో పాటు లక్ష రూపాయల నగదు కూడా అందజేయనున్నారు.

ఈ అవార్డులు ఎందుకంటే..
మహిళలు తమ కలలను నెరవేర్చుకునేందుకు వయసు, భౌగోళిక అడ్డంకులు లేదా వనరుల లభ్యత ఇతర కారణాలేవో ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని అధిగమించేందుకు, వారి అచంచలమైన స్ఫూర్తి సమాజాన్ని మరియు ముఖ్యంగా యువ భారతీయ మనస్సులను లింగ మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి మరియు లింగ అసమానతలను, వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి మహిళలను ప్రేరేపిస్తుంది'' అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సమాజం అభివృద్ధిలో మహిళలను సమాన భాగస్వాములుగా గుర్తించే ప్రయత్నమే ఈ అవార్డులను వివరించింది.

ఈ అవార్డులను..
నారీ శక్తి పురస్కారాలను వ్యవస్థాపకులు, వ్యవసాయం, ఆవిష్కరణలు, సామాజిక పని, విద్య మరియు సాహిత్యం, భాషా శాస్త్రం, కళలు మరియు చేతి వృత్తులు, STEMM(Science, Technology, Engeneering and Mathematics), వైకల్య హక్కులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు, వన్యప్రాణుల సంరక్షణ వంటి రంగాల వారికి ఈ అవార్డులను అందజేస్తారు.

పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారంటే..
నారీ శక్తి అవార్డు గ్రహితలలో సామాజిక వ్యవస్థాపకురాలు అనితా గుప్తా, సేంద్రీయ రైతు మరియు గిరిజన ఉద్యమకారిణి ఉషాబెన్ దినేష్ భాయ్ వాసవ, ఆవిష్కర్త నసీరా అఖ్తర్, ఇంటెట్-ఇండియా హెడ్ నివృత్తి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ డ్యాన్సర్ సైలీ నంద్కిషోర్ అగవానే, తొలి మహిళా పాము రక్షకురాలు వనితా జగదీయో బియోర్ మాథమాటిక్ తో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
ఈ సమాచారం మొత్తం PTI నుండి సేకరించబడింది.
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.



Click it and Unblock the Notifications