Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
International Women’s Day 2023: నారీ శక్తి పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ఈ ఏడాది ఎవరికొచ్చాయంటే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలను 29 మంది మహిళలకు అందజేయనున్నారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాల్లో అత్యుత్తమ శక్తివంతమైన మహిళల్లో 29 మందిని ఎంపిక చేశారు.

దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు మహిళా దినోత్సవం రోజున నారీ శక్తి పురస్కారాలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
వీరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంభాషించనున్నారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అభివృద్ధి కోసం క్రుషి చేసిన మహిళలు, ముఖ్యంగా బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల సాధికారత కోసం, వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది.

నారీ శక్తి పురస్కారం ఎవరికి..
నారీ శక్తి పురస్కారం అనేది మహిళలు మరియు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ, వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అసాధారణమైన సహకారాన్ని గుర్తించి, మహిళలను గేమ్ ఛేంజర్ గా మరియు సమాజంలో సానుకూల మార్పునకు ఉత్ప్రేరకంగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘నారీ శక్తి' అవార్డుకు ఎంపికైన వారికి సర్టిఫికెట్ తో పాటు లక్ష రూపాయల నగదు కూడా అందజేయనున్నారు.

ఈ అవార్డులు ఎందుకంటే..
మహిళలు తమ కలలను నెరవేర్చుకునేందుకు వయసు, భౌగోళిక అడ్డంకులు లేదా వనరుల లభ్యత ఇతర కారణాలేవో ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని అధిగమించేందుకు, వారి అచంచలమైన స్ఫూర్తి సమాజాన్ని మరియు ముఖ్యంగా యువ భారతీయ మనస్సులను లింగ మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి మరియు లింగ అసమానతలను, వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి మహిళలను ప్రేరేపిస్తుంది'' అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సమాజం అభివృద్ధిలో మహిళలను సమాన భాగస్వాములుగా గుర్తించే ప్రయత్నమే ఈ అవార్డులను వివరించింది.

ఈ అవార్డులను..
నారీ శక్తి పురస్కారాలను వ్యవస్థాపకులు, వ్యవసాయం, ఆవిష్కరణలు, సామాజిక పని, విద్య మరియు సాహిత్యం, భాషా శాస్త్రం, కళలు మరియు చేతి వృత్తులు, STEMM(Science, Technology, Engeneering and Mathematics), వైకల్య హక్కులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు, వన్యప్రాణుల సంరక్షణ వంటి రంగాల వారికి ఈ అవార్డులను అందజేస్తారు.

పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారంటే..
నారీ శక్తి అవార్డు గ్రహితలలో సామాజిక వ్యవస్థాపకురాలు అనితా గుప్తా, సేంద్రీయ రైతు మరియు గిరిజన ఉద్యమకారిణి ఉషాబెన్ దినేష్ భాయ్ వాసవ, ఆవిష్కర్త నసీరా అఖ్తర్, ఇంటెట్-ఇండియా హెడ్ నివృత్తి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ డ్యాన్సర్ సైలీ నంద్కిషోర్ అగవానే, తొలి మహిళా పాము రక్షకురాలు వనితా జగదీయో బియోర్ మాథమాటిక్ తో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
ఈ సమాచారం మొత్తం PTI నుండి సేకరించబడింది.
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.



Click it and Unblock the Notifications