బీఎస్‌ఎన్‌ఎల్ తో రతన్ టాటా చేతులు కలపడంతో... జియో, ఏయిర్‌టెల్ పని అయిపోయినట్టేనా..?

బీఎస్‌ఎన్‌లో తో రతన్ టాటా చేతులు కపడంతో జియో, ఏయిర్‌టెల్ వెనక్క తగ్గునున్నాయా ? ఇక జియో పని ఐపోయిందా.. బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ పుంజుకుకోనుందా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నాయ్. బీఎస్ఎన్‌ఎల తన వినియోగదారుల కోసం కొత్త రూపాన్ని సంతరించుకొని ఐడియా, ఏయిర్‌లెట్, జియోకు గట్టి దెబ్బ కొట్టనుంది. బీఎస్‌ఎన్ఎల్ ఇప్పుడు మునుపటిలా లేదు అక్కడ జనాలు చాలా రద్దీగా కనిపిస్తున్నారు. రతన్ టాటా, బీఎస్‌ఎన్ఎల్ చేతులు కలపడంతో.. ఈ రెండూ కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల జియోకు, ఏయిర్‌టెల్‌కు చావు దెబ్బేనని వ్యాపార వర్గంలో టాక్ వినిపిస్తోంది.

bsnl vs jio and airtel

బీఎస్‌ఎన్ఎల్ 5జీ సిమ్‌లను లాంచ్ చేయగానే అప్పటివరకు బీఎస్‌ఎన్ఎల్‌కు వున్న డిమాండ్ కంటే 5 రెట్లు పెరిగింది. ఇటీవల 1లక్ష 60వేల మంది బీఎస్‌ఎన్ఎల్ కొత్త కస్టమర్లు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయ్. గత నెల నుంచి బీఎస్‌ఎన్ఎల్ ఫామ్ లోకి వచ్చిన తరువాత తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్త 5 జీ టవర్లను ఏర్పాటు చేసి వినియోగదారుల కోసం తక్కువ ధరనే కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తేనుంది.

జియో, ఏయిర్‌టెల్, ఐడీయా, వొడాఫోన్లు తమ రీచార్జ్ రేట్లను భారీగా పెంచేసాయ్. దీంతో బీఎస్‌ఎన్ఎల్ చేస్తున్న ప్రకటనల వల్ల పెద్ద సంఖ్యలో కస్టమర్లు బీఎస్‌ఎన్ఎల్ వైపు మొగ్గుచూపనున్నారు. బీఎస్‌ఎన్ఎల్ తాజాగా చేసిన ప్రకటనలో కస్టమర్లకు చవకైన ధరకు ఇంటర్నెట్ సర్వీసులను అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు సైలెంగ్‌గా వున్న బీఎస్‌ఎన్ఎల్ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రయివేటు టెలికాం సంస్థలు ఒకేసారి రీచార్జ్ రేట్లను పెంచడం కూడా బీఎస్‌ఎన్ఎల్‌ కు బాగా కలిసి వచ్చింది. బీఎస్‌ఎన్ఎల్ 2జీ, 3జీ టవర్లు దేశవ్యాప్తంగా విస్తరించి వున్నాయ్. ఇప్పటికే దశంలో అనేక గ్రామాల్లో, కొండలు, అడువుల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్ఎల్ మాత్రమే వున్న చాలా ప్రదేశాలున్నాయ్. బీఎస్‌ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ కావడం వల్ల లాభం చూసుకోకుండా గ్రామాల్లో, అడవుల ప్రాంతాల్లో కూడా బాగా విస్తరించింది.

రాబోయే 2 సంవత్సరాల వరకు ప్రజలకు హైస్పీడ్ నెట్వర్క్ అందించడానికి బీఎస్‌ఎన్ఎల్ సిద్ధమంది. దీనికోసం భారీగా పెట్టుబడి కూడా పెట్టింది. గతేడారి బీఎస్‌ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వం నుంచి 89 వేల కోట్ల నిధిని అందుకుంది.
రతన్ టాటా బీఎస్‌ఎన్ఎల్ తో చేతులు కలపడం వల్ల 10వేల 4జీ టవర్లను పెంచారు. బీఎస్‌ఎన్ఎల్ కార్యాలయాల్లో ఎప్పుడూ లేనంత రద్దీ కూడా మొదలైంది. దీంతో జియో, ఏయిర్‌టెల్,ఐడీయా, వొడాఫోన్ కస్టమర్లు కూడా బీఎస్‌ఎన్ఎల్ వైపు వస్తున్నారు.

రోజురోజుకూ బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. 4 జీ నెట్వర్క్‌కు సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయ్. రతన్ టాటా చేతికి బీఎస్‌ఎన్ఎల్ వెళ్లడంతో కొన్ని నెలల్లోనే దేశం మొత్తం వేగంగా బీఎస్‌ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ విస్తరించనుంది. బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లు 1.61 లక్షల మంది పెరిగితే ఏయిర్‌టెల్ 68వేల మంది, వొడాఫోన్ 49వేల మంది, జియో 6లక్షల మంది పైగా కస్టమర్లు తగ్గిపోయారు.

Story first published: Wednesday, July 17, 2024, 18:00 [IST]
Desktop Bottom Promotion