Latest Updates
-
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
హైదరాబాద్ లో లవ్ జీహాద్?: బలవంతంగా ఇస్లాంలోకి మార్చి..తొలిరాత్రే నలుగురితో కలిసి అత్యాచారం
హైదరాబాద్లో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక మహిళను మోసం చేసి, మతం మార్చి, ఆమె జీవితాన్ని నరకప్రాయం చేసిన వైనం సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
హిందూ పేరుతో నమ్మించి.. వంచించి..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణమైన కథ 2021 మే నెలలో మొదలైంది. బాధితురాలు కూకట్ పల్లిలో నివసిస్తుంటది. నిందితుడు నవాజ్, ఆమెకు చెందిన షాపును అద్దెకు తీసుకునే నెపంతో పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్న నవాజ్, ఆమెను నమ్మించడానికి ఏకంగా తన మతం మార్చుకున్నానని కట్టుకథలు అల్లాడు.

తాను హిందూ మతాన్ని స్వీకరించి, తన పేరును నవదుర్గగా మార్చుకున్నానని నమ్మించాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఇదే అబద్ధాన్ని నిజమని నమ్మించారు. ఆ నమ్మకంతోనే ఆమె అతనితో స్నేహం చేసింది.
మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. బ్లాక్ మెయిలింగ్
మే 24, 2021న తన కుటుంబ సభ్యులతో మీటింగ్ ఉందని నమ్మించి ఆమెను ఒక రిసార్ట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆహారంలో మత్తుమందు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక, ఆ సమయంలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీసి తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి 2025 జులైలో కూకట్ పల్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు.
మొదటి రాత్రే గ్యాంగ్ రేప్
పెళ్లి తర్వాత మొదటి రాత్రే బేగంపేట ఫ్లాట్ లో నవాజ్, అతని సోదరులు మునావర్, షారూఖ్, ఇస్మాయిల్, స్నేహితుడు నీలోఫ్ కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని..వీడియోలు తీసి బెదిరించి పలుమార్లు భర్త,అతని సోదరులు తనపై అత్యాచారం చేశారని భాదితురాలు వాపోయింది. హవాలా వ్యాపారం చేసే నవాజ్.. తన దగ్గర నుంచి సుమారు రూ.16 లక్షల నగదు వసూలు చేశారని తెలిపింది. తన పేరు మీద లోన్లు తీసుకున్నారని, తన బంగారం అమ్మించారని, తన పేరు మీద ఉన్న ల్యాండ్ కూడా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
బలవంతంగా మత మార్పిడి
పెళ్లయ్యాక ఆమె పేరును నజీరాగా మార్చి, ఖురాన్ చదవాలని, కల్మా పఠించాలని ఒత్తిడి చేశారు. శాకాహారి అయిన ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించి హింసించారని ఆమె తెలిపింది. ఈ ఏడాది జనవరిలో నవాజ్ పరారయ్యాడు. దుబాయ్ లో ఉండే కొందరు వ్యక్తులు మనల్ని చంపేస్తారని, మన కోసం వెతుకుతున్నారని, అందుకే మనం దాక్కోవాలని నవాజ్ చెప్పేవారని బాధితురాలు మీడియాకు తెలిపింది.
మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆరా తీయగా.. నవాజ్ కు ఇది మూడో వివాహమని తెలిసి షాక్కు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. జనవరి 16న తాను పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన లేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేయాల్సింది పోయి, మిస్సింగ్ కేస్ గా నమోదు చేశారని ఆమె పేర్కొంది. తర్వాత ఏప్రిల్ 4న కూకట్ పల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారు.



Click it and Unblock the Notifications