కోట్లు ఖర్చు, భారత కరెన్సీ కట్టలతో వినాయకుడి గుడి, విగ్రహం, కళ్లు జిగేల్ అంటున్నాయి (వీడియో)

Ganesh Chaturthi: విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. వినాయక చవితి సందర్బంగా దేశంలోని పలు వినాయకుడి ఆలయాలు ఘనంగా ముస్తాబు అయ్యాయి. ఒక విగ్రహానికి మరో విగ్రహం భిన్నంగా ఉంటున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకరికి ఒకరు పోటీగా వినాయకుడి విగ్రహాలు తయారు చేశారు.

బెంగళూరునగరంలో గణపతి మందిరాన్ని భారత కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. ఒకవైపు రూ 10, రూ 20, రూ 50, రూ 100, రూ 500 రూపాయల నోట్ల దండలతో అలంకరించారు, మరో వైపు భారతలో చలామణి అవుతున్న నాణేలతో అలంకరణతో పాటు రూ. 10, రూ 20 నాణేలతో కళ్లు చెదిరేలా అలంకరించారు.

ganesh chaturthi

బెంగళూరు నగరంలోని జేపీ నగర్ రెండో స్టేజ్ లోని పుట్టేనహళ్లిలోని సత్యసాయి గణపతి ఆలయంలో అంగరంగ వైభవంగా గణేశుడి విగ్రహం తయారు చేశారు. వేలాది మంది భక్తులు వినాయకుడి గుడికి వెళ్లి వస్తున్నారు. సత్య గణపతి షిరాడీ సాయిబాబా ట్రస్టు నిర్వహకులు భారత కరెన్సీ నోట్లు, నాణేలను అలంకరించేందుకు సుమారు మూడు కోట్ల రూపాయలను వినియోగించారు.

రూ. 58 లక్షల విలువైన రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతో తరువాత రెండు కోట్లకు పగా విలువైన రూ 10, రూ 20, రూ 50, రూ 100, రూ 200, రూ 500 నోట్ల కట్టలతో వినాయకుడి గుడిని అలంకరించారు. ప్రత్యేకంగా నోట్ల కట్టలు, నాణేలతో అలంకరించిన వినాయకుడి గుడి, విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, ఈ వైభవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు వెలుతున్నారు.

గురుపౌర్ణమి నాడు షిర్డీ సాయిబాబాను కొబ్బరికాయలు, బాదం, ఖర్జూరం, పండ్లతో అలంకరించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్రస్ట్ నిర్వహకులు ఈసారి గణేషోత్సవానికి స్వయంగా లక్ష్మీదేవితో వినాయకుడి విగ్రహంతో పాటు గుడిని అలంకరించారు. 120 మందికి పైగా ఉన్న బృందం గుడిలో కరెన్సీ నోట్లను అలంకరించేందుకు పక్షం రోజులు కష్టపడ్డారని నిర్వహకులు అంటున్నారు.

అలాగే చంద్రయాన్-3 విజయంతో మన ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నించారు. జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్‌లతో నాణేలతో చక్కగా అలంకరించారు. వినాయకుడి గుడిని అలంకరించడానికి ఈ సొమ్ము అంతా భక్తులు ఇచ్చారని, ట్రస్టు జమ చేసిన సొమ్ము కూడా ఉపయోగించామని ట్రస్టీ రామ్మోహన్ రాజ్ అంటున్నారు.

గుడిలో కరెన్సీ నోట్లను కాపాడటం కోసం భద్రత కోసం 15 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించగా, భద్రత కోసం 20కి పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం వేకువ జామున 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలంకరణ చూసేందుకు వచ్చే భక్తులపై సీసీ కెమెరాల నిఘా ఉంది.

కరెన్సీ నోట్ల కట్టలతో అలంకరించిన నోట్లను భక్తులు ముట్టుకోకుండా బారికేడ్ వేసి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈసారి గణేశోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఇక్కడి కాన్సెప్ట్ ప్రజలను ఆకర్షిస్తోంది. గణేశ చతుర్థి నాడు వివిధ రకాల వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజ పునస్కారాలు నిర్వహిస్తారు.

Story first published: Tuesday, September 19, 2023, 9:00 [IST]
Desktop Bottom Promotion