Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోర ప్రమాదం..భక్తులు మృతి!
ప్రముఖ పుణ్యక్షేత్రమై సింహాద్రి అప్పన్న ఆలయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఇవాళ అప్పన్న ఆలయంలో చందనోత్సవం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన టెంపుల్) ఆలయానికి వెళ్లారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మంగళవారం రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దెబ్బకు సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టిక్కెట్ క్యూలైన్ పై ఒక సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందినట్లు సమాచారం. వెంటనే అధికారులు,పోలీసులు రంగంలోకి దిగారు.

గోడ కూలిపోవడంతో భక్తుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదస్థలానికి ఎన్టీఆర్ఎఫ్,ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన 6 మృతదేహాలను వెలికి తీయగా..శిథిలాల కిందనే మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మరికొందరు భక్తులు కూడా గాయపడగా వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలకు విశాఖ కేజీహెచ్ కు తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా,మృతుల్లో ముగ్గురు మహిళలు,5గురు పురుషులు ఉన్నారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిజరూప దర్శనం
లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తును సింహగిరికి భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపాక స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి అభిషేకాలు నిర్వహించారు.



Click it and Unblock the Notifications