Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోర ప్రమాదం..భక్తులు మృతి!
ప్రముఖ పుణ్యక్షేత్రమై సింహాద్రి అప్పన్న ఆలయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఇవాళ అప్పన్న ఆలయంలో చందనోత్సవం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన టెంపుల్) ఆలయానికి వెళ్లారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మంగళవారం రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దెబ్బకు సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టిక్కెట్ క్యూలైన్ పై ఒక సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందినట్లు సమాచారం. వెంటనే అధికారులు,పోలీసులు రంగంలోకి దిగారు.

గోడ కూలిపోవడంతో భక్తుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదస్థలానికి ఎన్టీఆర్ఎఫ్,ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన 6 మృతదేహాలను వెలికి తీయగా..శిథిలాల కిందనే మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మరికొందరు భక్తులు కూడా గాయపడగా వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలకు విశాఖ కేజీహెచ్ కు తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా,మృతుల్లో ముగ్గురు మహిళలు,5గురు పురుషులు ఉన్నారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిజరూప దర్శనం
లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తును సింహగిరికి భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపాక స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి అభిషేకాలు నిర్వహించారు.



Click it and Unblock the Notifications











