Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మూడవ ప్రపంచ యుద్ధం అంచున ప్రపంచం..ఇరాన్ పై బాంబుల వర్షం.. నిజమవుతున్న బాబా వంగా జోస్యం!
శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన భీకర దాడులు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడులతో మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సరిగ్గా ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. అంధ బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా దశాబ్దాల క్రితం చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె చెప్పినట్లే జరగబోతోందా? అన్న భయం ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది.

ఇరాన్ ప్రతీకారం
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాలకు సమీపంలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు లక్షిత దాడులు చేశాయి. ఇరాన్ అణు ముప్పును నిర్మూలించడానికే ఈ ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను సమర్థించారు. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, స్వేచ్ఛను పొందడానికి ఇదే సరైన అవకాశం అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు.
అయితే దీనికి ప్రతీకారంగా ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన రీతిలో విరుచుకుపడింది. ఈ వివాదం కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ వరకే పరిమితం కాలేదు. భారతీయులు, ప్రత్యేకించి లక్షలాది మంది తెలుగువారు ఉపాధి పొందుతున్న కువైట్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
ముఖ్యంగా బహ్రెయిన్ లోని అమెరికా నేవల్ బేస్ ను ఇరాన్ మిస్సైళ్లు భస్మీపటలం చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. యుద్ధ భయాలతో ఇరాన్, ఇజ్రాయెల్ తమ గగనతలాలను పూర్తిగా మూసివేశాయి.
అక్షరసత్యమవుతున్న బాబా వంగా జోస్యం?
ఈ పరిణామాల నేపథ్యంలో 1996లో మరణించిన బాబా వంగా చెప్పిన జోస్యం నిజమవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. 2025-2026 మధ్య కాలంలో తూర్పు దేశాల (మధ్యప్రాచ్యం) నుంచి ఒక మహా యుద్ధం ప్రారంభమవుతుందని, ఇది క్రమంగా ప్రపంచం మొత్తాన్ని కబళిస్తుందని ఆమె దశాబ్దాల క్రితమే ఊహించారు.
ముస్లిం దేశాలకు, పాశ్చాత్య దేశాలకు మధ్య జరిగే ఈ ఘర్షణ వినాశనానికి దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ఆమె చెప్పిన అదృశ్య ఆయుధాలు, రసాయన దాడుల ముప్పు.. నేటి ఆధునిక క్షిపణి, అణు దాడులను తలపిస్తున్నాయి.
యూరప్ కు పీడకల.. రష్యాకు ప్రాబల్యం
బాబా వంగా ప్రవచనం ప్రకారం.. ఈ యుద్ధం తీవ్రత వల్ల పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూరప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 2026 నాటికి యూరప్ జనాభా గణనీయంగా తగ్గిపోతుందని, అక్కడి భూమి నిస్సారంగా, జీవించడానికి అనుకూలం కానిదిగా మారుతుందని ఆమె అంచనా వేశారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు దారితీస్తుంది. మరోవైపు ఈ వినాశనం తర్వాత అంతర్జాతీయ శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోయి, రష్యా ఒక తిరుగులేని ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని బాబా వంగా చెప్పారు.
విలయతాండవం
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో రాజుకున్న అగ్గి, టెహ్రాన్ ఆకాశంలో ఎగసిపడుతున్న పొగ మేఘాలు చూస్తుంటే.. బాబా వంగా చెప్పిన ఆ విధ్వంసపు బీజాలు పడిపోయాయా అన్న ఆందోళన కలుగుతోంది.ుి



Click it and Unblock the Notifications











