Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Viral Video : పానకం తాగుతున్న వారాహి అమ్మవారు.. పూజారి ఇంట్లో అద్భుత ఘటన..!
ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి పూజలు పెరుగుతున్నాయ్. మరో పక్క అమ్మవారి మహిహలు కూడా చాలా చోట్ల మనకు దర్శనమిస్తున్నాయ్. అమ్మవారికి పూజలు చేసిన భక్తులకు తప్పకుండా ఆశీస్సులు లభిస్తాయ్. వారాహి అమ్మవారు ఇటీవల నీళ్లు తాగుతున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా అటాంటి సంఘటనే మరొకటి జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. అక్కడ బ్రహ్మణ వీధిలో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగుతున్న వీడియో వైరల్ అయింది.

ఈ సంఘటన మొత్తం పీలేరులోని శివాలయంలో పూజారి కుమారస్వామి ఇంట్లో జరిగింది. వారం రోజులుగా నవరాత్రులు సందర్భంగా అమమవారికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా అమ్మవారి విగ్రహం ముందు పూజారి పానకాన్ని వుంచారు. ఆ పానకాన్ని అమ్మవారి విగ్రహం తాగడాన్ని పూజారి భార్య లక్ష్మీ స్వయంగా చూసింది. ఈ సంఘటనను చుట్టుపక్కల అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్గా మారింది. ఈ వింతను చూసేందుకు పూజారి ఇంటికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
జులై 6 నుంచి జులై 15 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయ్. ఈ తొమ్మది రోజులూ ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అలంకారంతో పూజించారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సమాజంలో కీర్తి, గుర్తింపును పొందతాము. వారాహి అంటే భూదేవి, ధాన్యలక్ష్మీ అని అర్థం. ఈ వారాహి అమ్మవారు చేతులో నాగలి, రోకలిని ధరించి వుంటుంది. ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే వారాహి అమ్మవారు మన జీవితంలో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. భూమిని దున్నడానికి నాగలిని ఎలాగైతే పడతామో అలాగే వారాహి అమ్మవారు కూడా మన బుద్ధిని మంచి మార్గం వైపు వెళ్లేలా చేస్తుంది.
వారాహి అమ్మవారు మనకు ఉగ్రరూపంలో కనబడ్డా కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ఆషాడంలొ వారాహి అమ్మవారిని ఆరాధించిన వారికి అన్ని అడ్డంకులూ తొలగిపోతయ్. కాశీకి క్షేత్రపాలికగా వారాహి అమ్మవారు వుంటుంది. కాశీ పట్టణంలో వారాహి అమ్మవారు నీలి రంగులో మనకు దర్శనమిస్తారు. వారాహ రూపంలో అమ్మవారు అరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శివరస్సుపైన చంద్రవంకతో ప్రశాంతంగా మనకు దర్శనమిస్తుంది.
కాశీలో మాత్రమే కాకుండా వారాహి అమ్మవారు తంజావూరులోని బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహి అమ్మవారే క్షేత్రపాలికగా వుంటారు. అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో మనకు దర్శనమిస్తారు.
పైన ఇచ్చిన వివరాలన్నింటినీ ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications