Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అన్నం తిన్నతరువాత స్నానం చేయవద్దు..! లేదంటే చాలా ప్రమాదం..!
కొంతమంది ఆకలి తట్టుకోలేక భోజనం చేస్తుంటారు. మరికొంతమంది పడుకునే ముందు స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయవచ్చా ? చేస్తే అమవుతుందోనని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ ఇలా స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని అంటున్నారు. పూర్వం పెద్దలు, భోజనం చేసిన తరువాత స్నానం చేస్తే దరిద్రం పట్టుకుంటుందని చెప్పేవారు. భోజనం చేసిన తరువాత లేదా పడుకునే ముందు ఎందుకు స్నానం చేయవద్దో తెలుసుకుందాం.

భోజనం చేసిన తరువాత తిన్నది అరగాలంటే మూడు ప్రాధానంగా జీర్ణకోశం దగ్గరికి వెళ్లాలి. రక్తప్రసరణ, ప్రాణవాయువు, శరీర బలం. ఈ మూడు వుంటేనే ఆహారం జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. భోజనం చేసి వంటి మీద నీళ్లు పోసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. చల్లబడిన ఈ శరీరాన్ని వేడిపరచాలంటే రక్తప్రసరణ వేగంగా జరగాలి. ఇలా శరీరం మొత్తానికి రక్తప్రసరణ జరగడం వల్ల పొట్ట దగ్గర అవసరమైన రక్తప్రసరణ శరీరానికి జరగడంతో జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురౌతాయ్. పొట్టదగ్గర రక్త ప్రసరణ తగ్గడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది.
ఇలా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయ్. కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా వున్నాయ్. జీర్ణ సమస్యలు తలెత్తుతాయ్.అందుకే పెద్దలు తిన్నాక దరిద్రమని అందుకే అన్నారు. ఎప్పుడో ఒకసారి ఇలా స్నానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు. కానీ కొంతమంది దీన్ని ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. అది మంచిది కాదని అటు ఆయుర్వేదం, ఇటు వైద్య శాస్త్రం చెబుతోంది.

కడుపునిండ తిన్న తరువాత పనికూడా చేయలేము. చదువాలని కూడా అనిపించదు. దీనికి కారణం ప్రాణవాయువు, బలం, రక్తప్రసరణ మొత్తం పొట్టదెగ్గరే వుండిపోవడమని అర్థం చేసుకోవాలి. ఎనర్జీ డైవర్షన్ జరగడం వల్ల మనకు ఈ సమస్య తలెత్తుతుంది.
స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు..
మగవారు రోజూ తలస్నానం చేస్తే చాలా మంచిది. లేదంటే కనీసం ప్రతి బుధవారం తప్పకుండా స్నానం చేయాలి. శుక్రవారమైనా సరే తలస్నానం చేసుకోవచ్చు. మగవాళ్లు ఎప్పుడు స్నానం చేసినా నగ్నంగా స్నానం చేయకూడదు. నీళ్లల్లో అగ్నిదేవుడు వుంటాడు కాబట్టి వస్త్రంతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తుడిచిన టవల్నే చుట్టుకోవద్దని చెబుతున్నారు, లేదంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని శాస్త్రం అంటోంది.



Click it and Unblock the Notifications











