గంటల వ్యవధిలోనే కూప్పకూలిన వెండి ధరలు..రూ. ఒక్కసారిగా రూ.21 వేల వరకు పతనం..

By Borra Hazarathaiah

ప్రపంచ బులియన్ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడంతో MCXలో వెండి ఫ్యూచర్స్ ధరలు కిలోకు రూ.21 వేల మేర పతనమయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే మార్చి కాంట్రాక్ట్ వెండి ధరలు ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.2,33,120కి చేరుకోవడం మార్కెట్‌లో తీవ్ర అస్థిరతను చూపిస్తోంది. అంతకుముందు రోజు వెండి ధరలు ఆల్‌టైమ్ హై అయిన రూ.2,54,174కి చేరుకున్నాయి.

అయితే ఆ స్థాయిల వద్ద కొనుగోళ్లకు మద్దతు తగ్గడంతో.. సేఫ్ హేవెన్ (సురక్షిత పెట్టుబడి) డిమాండ్ తగ్గింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ధరలు భారీ ఊగిసలాటను చూపించాయి. సోమవారం ట్రేడింగ్‌లో వెండి ధరలు తొలిసారిగా ఔన్సుకు 80 డాలర్ల మార్కును స్వల్పంగా దాటాయి. అయితే వెంటనే లాభాల స్వీకరణ మొదలవడంతో ధరలు 75 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.


Silver prices surge silver price volatility silver investment risk silver as critical mineral global silver demand silver industrial usage silver price history silver market crash risk silver generational bubble silver vs gold investment silver price India silver price per kg India silver rally 2025 silver correction warning ICICI Prudential silver outlook silver supply shortage silver demand AI chips silver EV solar demand silver geopolitical risk silver tariffs US China

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో భౌగోళిక రాజకీయ భయాలు తగ్గాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించడం మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్‌ను పెంచింది. దీనివల్ల సేఫ్ హేవెన్ ఆస్తులైన బంగారం, వెండిపై ఒత్తిడి పెరిగింది.

ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 181 శాతం వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారాన్ని కూడా మించిపోయాయి. అమెరికా వెండిని కీలక ఖనిజంగా గుర్తించడం, సరఫరా పరిమితులు, పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం, పెట్టుబడి డిమాండ్ కారణంగా ధరలు రాకెట్‌లా పెరిగాయి. అయితే ఈ అతి వేగమైన పెరుగుదలే ఇప్పుడు ప్రమాదంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అదను చూసి దెబ్బ కొట్టిన చైనా.. ఒక్క నిర్ణయంతో వెండి ధరలు ఆకాశానికి..షాక్‌లో ప్రపంచ దేశాలు

BTIG వంటి ఆర్థిక సంస్థలు వెండి ధరలు పారబాలిక్ స్థాయికి చేరాయని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు 200-డే మూవింగ్ అవరేజ్ (200-DMA) కంటే దాదాపు 89 శాతం ఎక్కువగా ట్రేడవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులే భారీ పతనాలకు దారితీశాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

1979-80లో Silver ధరలు ఔన్సుకు 6 డాలర్ల నుంచి 49 డాలర్లకి చేరి.. ఆ తర్వాత 90 శాతానికి పైగా కూలిపోయాయి. 2011లో కూడా వెండి 48 డాలర్ల దగ్గర గరిష్టాన్ని తాకి, తరువాతి సంవత్సరాల్లో 75 శాతం వరకు పడిపోయింది. చరిత్రను చూస్తే.. మొమెంటం బ్రేక్ అయిన తర్వాత వెండిలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం.. మొత్తం ట్రెండ్ ఇంకా పాజిటివ్‌గానే ఉన్నా, మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. రూ.2.4 లక్షల స్థాయి వెండికి తాత్కాలిక మద్దతుగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం. వెండిలో భారీ లాభాలు ఇచ్చిన ర్యాలీ ఇప్పుడు లాభాల బుకింగ్ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా అడుగులు వేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Credit: Goodreturns

Desktop Bottom Promotion