Latest Updates
-
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే..
పసిపిల్లల పెరుగుదలకు, శక్తినిచ్చే ఇండియన్ ఫుడ్స్
మీ పసిపిల్లలకు ఆహారాన్ని తినపించండం మొదలు పెట్టగానే ఒకే సారి ఘనాహారం ఇవ్వడం లేదాప్యాక్ చేసిన ఆహారాలు, మరియు బార్లీ వంటి మాత్రమే వారికి అందివ్వకూడదు. భారత దేశంలో పిల్లలు తినే ఆహారంపైన చాలా రీసెర్చ్ లే చేసి పసిపిలల్లకు సరైనటువంటి పౌష్టికాహారం అందడం లేదని తేల్చారు. తల్లి గర్భవతిగా ఉన్నప్పుటి నుండి తల్లితో పాటు లోపల పెరిగే బిడ్డకు కావల్సిన పౌష్టికాహారాన్ని తీసుకోవల్సి ఉంటుంది. అయితే తల్లి ప్రసవించిన మొదటి సంవత్సరం, లేదా రెండేళ్ళ పాటు తల్లి పాలను అందించిన తర్వాత పసిపిల్లలకు ఘనాహారాన్ని తినిపించడం మొదలు పెడుతారు. ఆ ఆహారంలో కూడా పిల్లలకు కావల్సిన ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, మినిరల్స్, ఫైబర్స్, కొవ్వులు అందేలా చూసుకోవాలి. ప్రస్తుతం బయట మార్కెట్స్ లో పసిపిల్లలకు పెట్టే ఆహారం దొరుకుతోంది. అయితే వాటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనం వుండదు.
సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి. పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాలలో, మానవ శరీరం అతి త్వరిత గతిన పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు సగటున 3 కిలోల బరువు తూగిన పసిపాప తనకు 6 నెలలు వచ్చేసరికి ఆ బరువు రెండింతలు పెరుగుతుంది. అలాగే, ఒక ఏడాది నాటికి ఆ బరువు 9 కిలోలు అవుతుంది. శిశువులు మరియు పిల్లలు చాలా చురుగ్గా ఉండడమే కాక వారు తమ శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుచేత, వీరికి శరీర పెరుగుదలకు మరియు అధికశక్తినిచ్చే ఆహారపదార్ధాలు అంటే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లో స్వయంగా తయారు చేసి పసిపిల్లకు అందించాలి. అలాంటి ఆహారాలు పిల్లల కోసం కొన్ని....

మొదటగా పసిపిల్లలకు ఘనాహారాన్ని మొదలు పెట్టే సమయంలో మెత్తగా ఉన్న పెరుగన్నాన్ని తినిపిస్తుంటారు బామ్మలు. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెడుటుంటారు. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్ అని చెప్చొచ్చు. ఎందుకంటే ఇది కారం,ఉప్పు అనేవి లేకుండా పిల్లలు కమ్మగా తినగలిగేటటువంటి ఆహారం. అంతే కాదు పిల్లలు నోట్లో సులభంగా పెట్టడానికి చాలా బాగుంటుంది. దీని వల్ల పిల్లలకు కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు కావల్సిన శక్తి అందుతుంది.

నెయ్యి లేదా ప్యూర్ వెన్న ను పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగుతాయి. సాధారణంగా భారత దేశంలో పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపిస్తుంటారు. పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. నెయ్యిని బయట తెచ్చుకొన్న మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీది లేదా ఇంట్లో స్వయంగా తయారు చేసినది మాత్రమే పిల్లలకు అందించాల్సి ఉంటుంది.

ఇండియన్ డైయట్ చాలా సాధారణంగా సింపుల్ గా ఉంటుంది. రైస్ లేదా రోటితో పప్పు వంటివి మనకు కావల్సినది తినవచ్చు. కాబట్టి పిల్లలకు తినిపించే ఆహారంలో కూడా ఇండియన్ స్ట్రక్చర్ ఉండాలనుకొంటే కారం లేకుండా మిక్క్ క్రీమ్, పెరుగు తో తయారు చేసి వంటలు చాలా ఆరోగ్యకరం. అంతే కాదు వెజిటేబుల్ లేదా చికెన్ తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్ ను చేర్చడం వల్ల కావల్సినన్ని న్యూట్రిషియన్స్ అంధిస్తాయి.

ఇలా చాలా మృదువైనటువంటి ఆహారాన్ని పిల్లలకు తప్పనిసరిగా తినిపించాల్సి ఉంటుంది. ఇండియన్ ఫుడ్స్ లో పిల్లలకు తినిపించే ఆహారాలు చాలా వెరైటీగా రైస్ తో తయారు చేసి పెట్టవచ్చు. కిచిడి అనేది పప్పు, రైస్, కూరగాయల తో చాలా మృదువుగా తయారు చేసి తినిపించవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాకుండా న్యూట్రిషియన్స్ కూడా అధికమే.

ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆహారం. పిల్లలకు తినిపించేటటువంటి ఇండియన్ ఫుడ్స్ లో దీన్ని కూడా బామ్మలు ప్రత్యేకంగా తయారు చేసి పెడుతుంటారు. దీన్ని గోధుమ రవ్వతో తయారు చేస్తారు. పిల్లల్లో మలబధ్దకం వంటి సమస్యలున్నా చాలా తేలికగా జీర్ణ అవుతుంది. అందుకు గోధుమ రవ్వను చాలా మెత్తగా ఉడికించి పెట్టాలి. గోధుమ రవ్వకు కూరగాయలు కూడా చేర్చి అంధివ్వొచ్చు. చివరగా నెయ్యిని గార్నిష్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.



Click it and Unblock the Notifications