తల్లితండ్రులు పిల్లలకు చెప్పే ఉత్తుత్తి అబద్ధాలు!

By B N Sharma

Funny Lies That Parents Tell
బహుశ:, కధలు చెపటమనేది అబద్ధాలు చెపటం నుండే మొదలై వుండవచ్చు. తాజాగా కనుగొన్న పరిశోధనలమేరకు తల్లితండ్రులు వారి పిల్లలను పెంచేటపుడు అబద్ధాలు చెపటంలో తమ పిల్లలను కూడా మించిపోతున్నారట. పిల్లల పెంపకంలో చిన్నపుడే కనీసం 3000 అబద్ధాలు తెలిసో తెలియకో పేరెంట్స్ చెపుతూంటారని తేలింది. తల్లితండ్రులు తమ పిల్లలకు వారు సరిగా ప్రవర్తించాలనే ఉద్దేశ్యంతో చిన్నపాటి విషయాలలో కూడా అబద్ధం చెపుతారు. పిల్లలు అడిగే ప్రశ్నలకుజవాబులు తెలియకపోతే కూడా అబద్ధం చెప్పేస్తారు.

సాధారణంగా తల్లితండ్రులు పిల్లకు చెప్పే అబద్ధాలలో 84 శాతం ఎలావుంటాయంటే 'శాంతా క్లాజ్ బహుమతులను మంచి పిల్లలకు మాత్రమే ఇస్తాడు' లాంటివిగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే....' ఒకప్పుడు మా పేరెంట్స్ మాకు చెప్పారంటూ తరాలను కూడా పేర్కొంటారు' - అని అధ్యయన బృందం తెలిపింది. మరో నవ్వు పుట్టించే విషయమేమంటే...తల్లి తండ్రులు తమ పిల్లలతో - తమతో హాస్యాలాడితే వారి జననాంగాలు వూడి వచ్చేస్తాయంటూ వుంటారు. అబద్ధాలు చెపితే, దేముడు కోప్పడతాడని, టివిని ఎక్కువ చూస్తే కళ్ళు వెడల్పు అయిపోతాయని, ఐస్ క్రీం బండి గంట వినపడితే చాలు అందులోని ఐస్ క్రములు అయిపోయాయని, గోంగూర తింటే బలం వస్తుందని, కండలు వస్తాయని మొదలైన అబద్ధాలు తల్లితండ్రులు పిల్లలకు చెపుతారు.

వాస్తవానికి, ఈ అబద్ధాలు, నిజమెంతో కూడా తెలియని తల్లితండ్రుల ఊహా చాతుర్యాలకు అద్దం పడతాయి. ఊహ తెలియకపిల్లలు తాత్కాలికంగా వాటిని అంగీకరించినా తర్వాతి సమయంలో అవి అబద్ధాలని కూడా గ్రహించేస్తారు. కనుక పిల్లలతో మాట్లాడేటపుడు తల్లి తండ్రులు వాస్తవ రీతిలో వారికి అంశాలను వివరించటం మంచిది. దాని వలన వారికి కొంత నాలెడ్జి పెరగటమే కాక భవిష్యత్తులో వారిని అంశాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేటందుకు తయారు చేసినవారవుతారు.

Story first published: Saturday, September 17, 2011, 15:16 [IST]
Desktop Bottom Promotion