పొట్ట నొప్పి ....కడుపులో గుడ గుడ!

By B N Sharma

Kid
పెద్ద పేగులలోకి చేరే హానిచేసే క్రిమి ఎక్కడినుండైనా సరే రావచ్చు మురికి చేతులు, చల్లని కలుషిత నీరు మొదలైన వాటినుండి వచ్చి పొట్టలో చేరి నొప్పి, విరేచనాలు, రక్తం పడటం, జ్వరం, ఆకలి మందగించటం వంటి లక్షణాలు కలిగిస్తాయి. అటువంటపుడు మీ పిల్లాడిని అమీబియాసిస్ నిర్ధారణకు వైద్యుని వద్దకు తప్పక తీసుకు వెళ్ళండి.

ఈ క్రిమి రోజులో 40 మిలియన్ల వరకు చేరిపోగలదు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో చేరిపోతుంది. పెద్ద పేగులో కూర్చుంటుంది. అక్కడవుండి మరింత వ్యాప్తి చెందుతుంది. 48 నుండి 72 గంటల తర్వాత గుడ్లు పెట్టేయడంతో దాని లక్షణాలు పైకి బాగా కనపడతాయి.

ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ మరియు ప్రొటీన్ నష్టపోవటం జరుగుతుంది. పిల్లాడిని వెంటనే వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాలి. వైద్యులు, మలపరీక్ష చేసి అమీబియాసిస్ నిర్ధారిస్తారు. దీనికి తగిన వైద్యంగా విశ్రాంతి, కఠిన ఆహార ప్రణాళిక అంటే ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలని చెపుతారు. డీ హైడ్రేషన్ నివారించటానికి నీరు అధికంగా తాగటం తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తినటం చేయాలి. కేరట్, అరటిపండు, కార్న్ వంటిసూప్ లు బాగా పని చేస్తాయి.

మరి పిల్లలకు అమీబియాసిస్ రాకుండా వారు ఆరోగ్యంగా వుండాలంటే తల్లులు ఏం చేయాలి?
ఇంటిలో ఆహారం తయారు చేసే పరిసరాలు శుభ్రంగా వుంచాలి, చేతులు మురికిగా వుంటే నోటిలో పెట్టుకోరాదని, చేతులు శుభ్రం చేసిన తర్వాతే ఆహారాలు తినాలని పిల్లలకు తెలియజెప్పాలి.
కొనుగోలు చేసే ఆహారాలు, నాణ్యతకలిగి మంచి ప్రదేశాలలో కొనుగోలు చేయాలి. బాత్ రూమ్ ఉపయోగించిన తర్వాత బిడ్డ తప్పక చేతులు కడిగేలా చూడాలి. కాచి వడబోసిన శుభ్రమైన నీటిని తాగేలా చేయాలి.

Story first published: Sunday, March 4, 2012, 15:28 [IST]
Desktop Bottom Promotion