Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
పిల్లలు స్వతంత్రంగా వ్యవహరించాలంటే?!

1. ఇంట్లో ఒక పార్టీ ఏర్పరచండి - కంప్యూటర్లు, టి.వి.లు, వీడియోగేములు పిల్లాడితో ఆపించండి. అవి మంచి స్నేహాలకు శత్రువులు. రుచికరమైన స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఏర్పాటు చేసి ఇంటి చుట్టు పక్కల మీ పిల్లాడి వయసువున్న పిల్లలను ఆహ్వానించండి. వారితో కలసి మాట్లాడేలా చేయండి.
2. ఆటలు - ఎక్కువమంది పిల్లలు కలిసి ఆడే ఆటలు ఆడించండి. కలసి ఆడితే, స్నేహానికి గెలుపు ఓటములు అందించే అలవాటు పిల్లాడికి కలుగుతుంది. కొత్త భాషలు తెలుసుకునే అవకాశం వుంటుంది.
3. ఇంటివద్దకు -మీ పిల్లాడి స్నేహితులను ఇంటికి రమ్మనండి. అతడిని ప్రత్యేకంగా వుంచక వారితో కలసి స్కూలుకు వెళ్ళడం ఇంటికి రావడం వంటివి నేర్పించండి. మీకు కూడా కొంత ఫ్రీ టైమ్ దొరుకుతుంది.
4. కలిసి చదవటాన్ని ప్రోత్సహించండి - పిల్లాడు తన స్నేహితుడితో కలిసి చదువుకుంటానంటే అంగీకరించండి. కలసి చదివితే, నాలెడ్జి అధికమవుతుంది.
5. ఇచ్చి పుచ్చుకోడం - మీరు స్నాక్స్ వంటి తినే పదార్ధాలను ఒక గ్రూపుకు తయారు చేస్తే, అవి మీ పిల్లాడు వారికివ్వటం, స్నేహాన్ని పెంచుకోడం వంటివి కూడా చేస్తాడు. స్నేహాన్ని పెంచే పుస్తకాలను చదవమని ప్రోత్సహించండి.
అంతేకాదు, పిల్లలలో నేడు ఆట పాటలు లోపిస్తున్నాయి. కనుక వారిని బహిరంగ ప్రదేశాలైన పార్కులు వంటి వాటిలో ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. చెట్లు ఎక్కడం, గోలీలు ఆడటం, బిళ్ళం గోడు ఆడటం వంటి సాంప్రదాయక పిల్లల ఆటలు నానాటికి తగ్గిపోతున్నాయని తాజాగా ఇంగ్లాండులో చేసిన ఒక అధ్యయనం తెలిపింది. పిల్లలకు ప్రకృతితో సంబంధం వుండే ఆటలు వెనుకబడుతున్నాయని, వారికి సహజ ప్రకృతితో సంబంధాలు వుండటం లేదని అధ్యయనకారుడు ఇప్సోస్ మోరి వెల్లడించారు. ఆయన తన స్టడీలో సుమారు 1,012 మంది వ్యక్తులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేశారు.
వారిని వారికి గుర్తువున్న చిన్నతనంలోని 12 అవుట్ డోర్ అనుభవాలను అంటే, చెట్లు ఎక్కడం, గోలీలు ఆడటం, బిళ్ళం గోడు ఆట, పక్షులకు ఆహారం వేయటం, వంటివి చెప్పవలసిందిగా కోరారు. ప్రజలలో 92 శాతం మంది పిల్లలకు ప్రకృతితో సంబంధం వుండే అవుట్ డోర్ ఆటలు అవసరమేనని తెలిపారు. 82 శాతంమంది, పాఠశాలలు పిల్లలకు బయటి ఆటలు కూడా బోధించాలని తెలిపారు. రీసెర్చిలో పిల్లలకు ప్రకృతితోగల సంబంధం వారి విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక నేర్పులు మొదలగువాటిపై ప్రభావం చూపగలదని తేలింది.
అయితే, నేటి రోజులలో అట్టి అవకాశాలు తగ్గి ప్రకృతితో వ్యతిరేక సంబంధిత ఫలితాలు పిల్లలకు, కుటుంబాలకు, సమాజానికి కలుగుతున్నాయని ఇది ప్రకృతి లోపం డిజార్డర్ గా ప్రజలలో రూపొందుతోందని అధ్యయనం తెలిపింది. ఇంటర్నెట్, వీడియే గేములు, మొదలైన ఇండోర్ వ్యాపకాలు పిల్లలలో పెరిగిపోవటంతో వారికి బయటి చర్యలు సమర్ధవంతంగా చేసే అవకాశం కూడా లేకుండా పోతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.



Click it and Unblock the Notifications