కాన్పు తర్వాత రక్తస్రావం కొనసాగుతోందా?

By B N Sharma

Deal With Postnatal Bleeding
మహిళలలో కాన్పు తర్వాత రక్తస్రావం జరగటం సాధారణమే. మహిళకు ఎర్రని రక్త స్రావం అధికంగా బిడ్డపుట్టిన తర్వాత రెండు లేదా మూడు వారాలవరకు కూడా కొనసాగుతుంది. కాన్పు సహజమైనా, సిజేరియన్ అయినా, ఈ రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్ధితి తీవ్రమైనదే. మహిళ దీనిపట్ల తగినంత జాగ్రత్త తీసుకోవాలి. మొదటి ఒకటి లేదా రెండు రోజుల పాటు హాస్పిటల్ ప్యాడ్ లు ఇస్తారు. తర్వాత రక్తస్రావం కొద్దిగా తగ్గితే సాధారణమైన ప్యాడ్ లు వాడవచ్చు.

వెలువడే రక్తం పది లేదా పన్నెండు రోజుల పాటు పింక్ రంగులో వుంటుంది. తర్వాత పసుపు, లేదా తెలుపు రంగుకు మారుతుంది. స్రావం గడ్డలుగా కూడా వుండవచ్చు. ఈ రక్తస్రావాన్ని నియంత్రించలేము. ఈ స్రావం జరగటం మంచిదేనని అది మహిళ జననాంగ వ్యవస్ధను శుభ్రపరుస్తుందని వైద్యులు చెపుతారు. మహిళ ఈ సమయంలో చేయవలసిందల్లా బాగా విశ్రాంతి తీసుకొని శక్తిని పుంజుకోవాలి. వీలైనంతవరకు నిలబడటం లేదా నడవటం వంటివి చేయరాదు. సుమారు 20 రోజుల వివ్రాంతి తర్వాత మెల్లగా పని చేస్తూండాలి. పది రోజులకే నడిచే వారుంటారు. కాని అది సరి కాదు.

కాన్పు తర్వాతి రక్తస్రావం కొరకు మందపాటి శానిటరీ నేప్ కిన్ రక్తం బాగా పీల్చేది వాడండి. రక్త స్రావం మరీ అధికంగా వుండి ప్రతి గంటకు ప్యాడ్ మార్చాల్సి వస్తే... వైద్యుడిని సంప్రదించండి. ఈ సమయంలో మీకు జ్వరం, చలి వంటివి వచ్చినా, దుర్వాసన వస్తున్నా అది ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుందని గ్రహించి వైద్య సహాయం పొందండి. మహిళకు కాన్పు తర్వాత రక్తస్రావం సహజమే. బాగా విశ్రాంతి తీసుకుంటూ ఆరు నెలలపాటు బరువులు ఎత్తవద్దు.

Story first published: Wednesday, October 19, 2011, 12:02 [IST]
Desktop Bottom Promotion