మహిళలలో రక్తస్రావం అరికట్టాలంటే....!

By B N Sharma

postnatal
డెలివరీ తర్వాత మహిళ రెండు లేదా మూడు వారాలపాటు, రక్తస్రావం సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సమస్య సిజేరియన్ లేదా సాధారణ డెలివరీ అయినా వస్తుంది. మహిళకు ఏర్పడే ఈ పరిస్ధితి తీవ్రమైనదే. ఈ సమస్య నివారణకు అధికంగా పీల్చివేసే శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. పది లేదా 12 రోజుల తర్వాత రక్తం పింక్ కలర్ కు ఆ తర్వాత పసుపు , తెలుపులకు మారుతుంది. రక్తస్రావం గడ్డలు లేదా పలుచగాను వుండవచ్చు.

వైద్యులు ఈ విధంగా అయ్యే రక్తస్రావం జననాంగ వ్యవస్ధను శుభ్రం చేస్తుందని కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు పూర్తి విశ్రాంతి అవసరం. రక్తప్రసరణ పెరిగేందుకు దోహదం చేసే అధిక సమయం నిలబడటం, నడవటం, బరువులు ఎత్తటం వంటివి చేయరాదు.

రక్త స్రావం అధికంగా వుంటే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు పొందాలి. మందులు, తగిన ఆహారం తీసుకుంటూ విశ్రాంతి పొందాలి.

Story first published: Thursday, November 24, 2011, 16:45 [IST]
Desktop Bottom Promotion