బిడ్డ బరువును నిర్ణయించే తల్లిపాలు!

By B N Sharma

Breastfeeding Decides Weight of Infants!
బిడ్డ పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం. సాధారణంగా కాన్పు జరిగిన వారు ఒకటి, రెండు గంటల్లోపుగాను, సిజేరియన్‌ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4,5 గంటల్లోపుగాను బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా, అవసరమైన బరువుతో పెరగగలుగు తుంది.తల్లిపాలు తాగే పిల్లలకు విరోచనాలు కూడా సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌, కాల్షియం, పొటాషియం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌, అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీనితో శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే మరోమారు ప్రెగ్నెన్నీకూడా రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూ లంగా తల్లిలో అప్పటికే వదులైన గర్భాశయం తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.

మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి.7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల వారికి ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్‌ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్‌ వెనక్కి ఉంటే పుట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్‌ చుట్టూ శు భ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.

తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాలను తినిపించడం మంచిది. బిడ్డకు ప్రతి రెండు, మూడు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే ప్రతి నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాల సమయమైనా పాలివ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే పదినుండి పదిహేను నిమిషాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.

Story first published: Thursday, April 5, 2012, 16:40 [IST]
Desktop Bottom Promotion