Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పసి పిల్లలకు పాలు పడితే స్తనాలు మెత్తబడుతాయా.... ?

చిన్నారులు ఎలాంటి జబ్బులతో ఉన్నా తల్లిపాలు పట్టాలి. పాలసీసాలు, పాల పీకలు ఎప్పటికీ వాడకం అంత మంచిది కాదు. 6వ నెలలో ఇంటిలో తయారు చేసిన అదనపు ఆహారం ఇవ్వడం మొదులు పెట్టాలి. అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు కనీసం రెండు సంవత్సరాల పట్టాలి. తల్లీ బిడ్డకు ఇష్టమైతే, రెండ సంవత్సరం తర్వాత ఎంత కాలమైనా తల్లిపాలు పట్టవచ్చు. తల్లి పాల సంస్కతి వల్ల తల్లుల్లో గర్భాధారణ వాయిదా ప్రకృతి సిద్దంగా జరగుతుంది. తల్లిపాలు పట్టడం వల్ల తల్లులలో ప్రసవానం తర రక్తస్రావం అరికట్టవచ్చు. మహిళల్లో స్తనాల కేన్సర్, అండాశయ కేన్సర్, ఆస్టియో పోరోసిస్ జబ్బులు నివారించవచ్చు. తల్లిపాలు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం...
కొత్తగా తల్లులయ్యే మహిళలకు బిడ్డలకు పాలు ఇవ్వటంలో ఎన్నో సందేహాలుంటాయి. పాలు పడితే తమ స్తన సౌందర్యం పోతుందని, మరోమారు పూర్వపు ఆకారాన్ని పటుత్వాన్ని స్తనాలు సంతరించుకోలేవని, పాలు పట్టినందువలన బాగా సాగిపోయి వేలాడతాయని భావిస్తూ వుంటారు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. కనుక మొదటగా పాలుపట్టే తల్లి తన స్తనాలు సాగిపోయే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ లేదని గ్రహించాలి. పాలు పట్టినందువలన రొమ్ములు మరోమారు పూర్వపు ఆకారాన్ని త్వరగా పొందే అవకాశం ఉంటుంది. ఈ చర్య ఆమెలోని కొవ్వును కరిగిస్తుంది. గర్భాశయం పూర్వపు రూపు సంతరించుకోవడానికి అవసరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
రొమ్ము సైజును బట్టి పాలు తయారవుతాయని చాలా మంది భావిస్తారు. కాని పాలగ్రంధుల పరిమాణాన్ని బట్టి పాలు తయారవుతాయని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ కారణంగా బిడ్డకు తల్లి పాలు పట్టకుండా వుండకూడదు. బిడ్డకు జలుబు చేసిందని, దగ్గువస్తోందని తల్లులు తమ పాలను నిలిపేస్తారు. కాని ఇది సరికాదు. తల్లి తీవ్రంగా జబ్బు పడితే తప్ప, బిడ్డకు పాలు పట్టటం ఆపరాదు. తల్లి ఏదేని తీవ్ర జబ్బుపడితే ఆమెలోని రోగక్రిములు పాల ద్వారా బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. పాలు పడితే స్తనాలు మెత్తబడిపోతాయనేది మహిళలల్లో ఉంటుంది. మెత్తబడినా అది తాత్కాలికంగా జరిగే ప్రక్రియ అని బిడ్డ సరిగా పాలు తాగుతుంటే మరోమారు పాలు ఇవ్వటం ఆగిన వెంటనే మహిళ కొద్దిపాటి వ్యాయామాలతో తన స్తనాల సౌందర్యం కాపాడుకోవచ్చునని గ్రహించాలి.



Click it and Unblock the Notifications