Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గర్భవతులకు బియ్యం చేసే హాని!

ఈ పరిశోధనలో, న్యూ హేంప్ షైర్ లోని డార్ట్ మౌత్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 229 ప్రెగ్నెంట్ మహిళల మూత్రాన్ని పరిశీలించారు. వారు తినే చేప, బియ్యం, నీరు మొదలగు ఆహారాలను సుమారు మూడు రోజుల ముందునుండే పరిశీలించారు. బియ్యం అధికంగా తిన్న మహిళల మూత్రంలో ఆర్సెనిక్, ఇనార్గానిక్ ఆర్సెనిక్ (అకర్బన పాషాణం) లు అధికంగా వున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క గ్రాము రైస్ కు 1 శాతం ఆర్సెనిక్ స్ధాయి పెరిగిందట. శరీరంలో ఇనార్గానిక్ ఆర్సెనిక్ స్ధాయి అధికమయితే, అది బ్లాడర్, లంగ్, చర్మ కేన్సర్, టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తుందని అమెరికా ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ తెలిపింది.
సాధారణ వ్యక్తులలో ఆర్సెనిక్ స్ధాయి ప్రభావం ఎలావున్నప్పటికి గర్భవతులలో మాత్రం పుట్టబోయే బిడ్డకు ఇది తప్పక హాని కలిగిస్తుందని తెలిపారు. అయితే బియ్యంలోని మరి కొన్ని ఆర్సెనిక్ పదార్ధాలు హాని కలిగించేవి కావని కూడా తెలిపారు. ఏది ఏమైనప్పటికి గర్భవతి మహిళలు తమ ఆహారంలో రైస్ వినియోగం అతి తక్కువగా వుండాలని పరిశోధకులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనా ఫలితాలను నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications