గర్భవతులకు బియ్యం చేసే హాని!

By B N Sharma

Eating Rice Raise Arsenic Levels!
సాధారణంగా వరి ధాన్యం ఇతర ధాన్యాలకంటే భూమిలోని విషపదార్ధాలను అధిక స్ధాయిలో గ్రహిస్తాయట. బియ్యం అధికంగా తినే వారికి వారి శారీరక వ్యవస్ధలో విష పూరిత పదార్ధాల స్ధాయి అధికంగా వుంటుందని ప్రెగ్నెంట్ మహిళలపై చేసిన ఒక స్టడీలో తేలింది. గర్భస్ధ దశలో తీసుకునే అధికస్ధాయి విషపూరిత పదార్ధాలు (అకర్బన పాషాణం) , గర్భస్ధ మావిని (బొడ్డుతాడు) దాటి కడుపులోని బిడ్డకు కూడా చేరి హాని కలిగిస్తాయని పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోధనలో, న్యూ హేంప్ షైర్ లోని డార్ట్ మౌత్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 229 ప్రెగ్నెంట్ మహిళల మూత్రాన్ని పరిశీలించారు. వారు తినే చేప, బియ్యం, నీరు మొదలగు ఆహారాలను సుమారు మూడు రోజుల ముందునుండే పరిశీలించారు. బియ్యం అధికంగా తిన్న మహిళల మూత్రంలో ఆర్సెనిక్, ఇనార్గానిక్ ఆర్సెనిక్ (అకర్బన పాషాణం) లు అధికంగా వున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క గ్రాము రైస్ కు 1 శాతం ఆర్సెనిక్ స్ధాయి పెరిగిందట. శరీరంలో ఇనార్గానిక్ ఆర్సెనిక్ స్ధాయి అధికమయితే, అది బ్లాడర్, లంగ్, చర్మ కేన్సర్, టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తుందని అమెరికా ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ తెలిపింది.

సాధారణ వ్యక్తులలో ఆర్సెనిక్ స్ధాయి ప్రభావం ఎలావున్నప్పటికి గర్భవతులలో మాత్రం పుట్టబోయే బిడ్డకు ఇది తప్పక హాని కలిగిస్తుందని తెలిపారు. అయితే బియ్యంలోని మరి కొన్ని ఆర్సెనిక్ పదార్ధాలు హాని కలిగించేవి కావని కూడా తెలిపారు. ఏది ఏమైనప్పటికి గర్భవతి మహిళలు తమ ఆహారంలో రైస్ వినియోగం అతి తక్కువగా వుండాలని పరిశోధకులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనా ఫలితాలను నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురించారు.

Story first published: Wednesday, December 7, 2011, 10:16 [IST]
Desktop Bottom Promotion