Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
ప్రెగ్నెంట్ మహిళ ఉద్యోగి అయితే, ఆహారం ఎలా వుండాలి?

మొలకెత్తిన విత్తనాలలో అత్యధిక ప్రొటీన్లు వుంటాయి. కండల నిర్మాణం బాగా జరగాలంటే ఆమె ఈ ఆహారాన్ని తినాలి. పెసలు, శనగలు, అలచందలు, వేరు శనగలు మొదలైనవి నీటిలో బాగా నానపెట్టి, మొలకలు కట్టి తగిన మొత్తాలలో తన పని స్ధలానికి తీసుకువెళ్ళి తినవచ్చు. మొలకెత్తిన విత్తనాలతోపాటు, కీరదోస ముక్కలు, కేస్పికం, టమాటాలు, పచ్చి మిరప వంటివి కూడా కలిపితే బాగానే వుంటాయి. వీటిలో కొద్దిపాటి నిమ్మరసం, ఉప్పు చేరిస్తే మరింత రుచికరంగా వుండి అనారోగ్యకరమైన బయటి ఛాట్ వంటి తిండ్లకు దూరంగా వుండవచ్చు. అయితే వీటిని మహిళ తయారు చేసిన రెండు లేదా మూడు గంటలలోపుగా తినివేయాలి.
ఉడికించిన మొక్కజొన్న విత్తులు, ఆకు కూరల శాండ్ విచ్ వంటివి కూడా తేలికగా జీర్ణం అయి శక్తినిస్తాయి. బ్రెడ్, వెన్న కూడా తినవచ్చు. ఉద్యోగం చేసే ప్రెగ్నెంట్ మహిళకు ఆహారం ఏ సమయంలో ఏదిగా వుండాలనేది పరిశీలించండి. నిద్ర లేవగానే ఉదయం ఒక కప్పు టీ మరియు రెండు బిస్కట్లు. ఉదయం 8 గంటలకు అల్పాహారంలో ఒక గ్లాసెడుపాలు, ఇడ్లీ రెండు లేదా మూడుగా వుండాలి. 10 గంటల సమయంలో రెండు లేదా మూడు పండ్ల ముక్కలు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక గ్లాసెడు లస్సి లేదా ఒక కప్పు కస్టర్డ్.
మధ్యాహ్నం వేళ లంచ్ లో రెండు రొట్టెలు కొద్దిపాటి పప్పు, తగినన్ని కూరలు, పెరుగు వుండాలి. సాయంకాలం స్నాక్స్ గా 4 గంటలకు ఒక కప్పు టీ , రెండు బిస్కట్లు, సాయంత్రం 6 గంటలకు ఒక గ్లాసెడు పాలు తీసుకోవాలి. రాత్రి 8 గంటలకు డిన్నర్ చేయాలి. దీనిలో రెండు రొట్టెలు, కొద్దిపాటి పప్పు, తగినన్ని కూరలు, పెరుగు వీటితో పాటు ఏదేని ఒక స్వీట్ వుండాలి.
రాత్రి నిద్రించే సమయంలో 10 గంటలకు 200 మి.లీ. పాలను తాగాలి. గర్భవతి మహిళ మాంసాహారి అయినట్లయితే, మధ్యాహ్నం లంచ్ లోను రాత్రి డిన్నర్ లోను కూరగాయలతోపాటు 1 గుడ్డు, 100 గ్రా. చికెన్, 80 గ్రా. మటన్, 120 గ్రా. చేపలు ప్రతిరోజూ తినాలి.



Click it and Unblock the Notifications