గర్భవతి మహిళ బొప్పాస పండు తింటే...!?

By B N Sharma

Important Tips Working Pregnant Women!
గర్భవతులైన మహిళా ఉద్యోగులు కార్యాలయాలలో ఆహార నియమాలు పాటించటమే కాక వారి పనిగంటలను కూడా ఒకేసారి అధికంగా వుండకుండా చూసుకోవాలి. ప్రతి నాలుగు గంటలకు కనీసం ఒక పదిహేను లేదా 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. గర్భవతులు చేయకూడని పనులు - ఆహారంలో వండని లేదా పచ్చి కూరలు, గుడ్లు, మాంసం వెన్నతీయని పాలు, వంటివి తినరాదు. ఇవి తింటే వారికి ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం వుంది.

ఆల్కహాల్, మత్తుమందులు, లేదా నిద్రమాత్రలు లేదా ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ వంటివి వాడరాదు.కాఫీ సంబంధిత పానీయాలు లేదా ఇతర పదార్ధాలు మానండి. రోజుకు 300 గ్రాముల మించి కాఫీ తీసుకోరాదు. పొగతాగరాదు. లేదా పొగతాగే వారి పక్కన వీరు వుండరాదు. డబ్బాలలో నిలువవుంచిన ఆహారాలు తినటం వీరికే కాక, కడుపులోని బిడ్డకు కూడా హాని కలిగిస్తాయి. కనుక ప్యాకేజ్డ్ ఆహారాలు పూర్తిగా మానండి.

బొప్పాస పండులో పేపయిన్ అనే ఎంజైములు వుంటాయి. ఇవి గర్భవతిలో గర్భ సంకోచ వ్యాకోచాలను అధికం చేసి త్వరగా నొప్పులు తెప్పించి గర్భవిచ్ఛిన్నం అయేలా చేస్తాయని రీసెర్చి చెపుతోంది. కనుక బొప్పాస పండు తినరాదు. ఏ మందులు వాడినా లేక, ఔషధ మూలికలు, విటమిన్లు వాడినప్పటికి వీటిలో కొన్ని బిడ్డకు హాని కలిగించేవి వుంటాయి కనుక డాక్టర్ సలహాపైనే వాడాలి.

Story first published: Sunday, March 18, 2012, 12:50 [IST]
Desktop Bottom Promotion