Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆడపిల్లను అక్కున చేరుద్దాం....!

తన మహిళ కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తేచాలు గర్భాన్ని సైతం విచ్ఛిన్నం చేయటానికి వెనుకాడరు. కాని తన పుటుకకు, పెంపకానికి, చివరకు తాను ఏ దశకు చేరాలన్నా ఒక ఆడదే తోడు అనే ప్రాధమిక అంశాన్ని కూడా గ్రహించని వారు నేటికి ఉన్నారు. మన దేశంలో ఆడ పిల్లలను గర్భంలోనే అంతమొందించటం చట్ట విరుద్ధంగా ప్రకటించారు. అసలు గర్భవతి అయినపుడు పుట్టేది ఆడా ? మగా? అని నిర్ణయించే వైద్య పరీక్షలను సైతం నిషేధించారు. మరి ఈ పరిస్ధితులలో చట్టపరంగా తగిన చర్యలు చేపట్టటమే కాక, సమాజపరంగా కూడా ప్రతి ఒక్కరు భ్రూణ హత్యలను అనాగరిక చర్యలుగా భావించి వాటిని నిరసించాలి.
తాజా సమాచారంగా, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా తన రాష్ట్రంలో ఆడపిల్లను పిండంగా ఉన్నపుడే గర్భంలోనే అంతమొందించటాన్ని ఒక హేయమైన చర్యగా ఖండించిన ఒక పంచాయతీ సంస్ధకు ఆ గ్రామాభివృధ్ధికిగాను కోటి రూపాయలను మంజూరు చేశారు. ఈ గ్రామం ఆ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో బిబి పూర్ గా పిలువబడుతోంది.ఆ గ్రామంలోని ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఆడ పిల్లలను భ్రూణ హత్య గావించటం చట్ట విరుద్ధమని, ఆ చర్య చాలా హీనమైనదని వారు ఖండించారు. ఈ గ్రామ ప్రజలు చేపట్టిన ఈ అంశం ఇతర ప్రాంతాల ప్రజలకు ఆదర్శమని, వీరి చర్య తమ రాష్ట్రంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఆదర్శమని ముఖ్యమంత్రి హూడా వారిని అభినందించారు.
ఈ గ్రామ ఖాప్ మహా పంచాయతీలో మొట్ట మొదటి సారిగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సమావేశం బిబిపూర్ గ్రామంలో జరిగింది. వారు అక్కడినుండే సమాజంలో చెడును తొలగించే ఈ అంశంపై ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మహాపంచాయతీ లో హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పంచాయతీలనుండి కూడా పెద్దలు పాల్గొని ఈ సామాజిక దురాచారాన్ని మట్టు బెట్టాలని తీర్మానించారు. మహిళా భ్రూణ హత్యల కారణంగా యువతుల సంఖ్య దేశంలో నానాటికి తగ్గిపోతోందని, ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు చర్యలు సమర్ధవంతంగా చేపట్టాలని వారు తీర్మానించారు.
ఇతర ఖాప్ పంచాయతీలు ముందుకు వచ్చి ఈ రకమైన సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హర్యానా రాష్ట్రం ఇప్పటికే ఈ మహిళా భ్రూణ హత్యల దురాచారం రూపుమాపటానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించిందని, వీటిని అమలు చేయటానికిగాను ప్రజలనుండి హృదయ పూర్వక మద్దతు అవసరమని, అపుడే, తాము ఆశించిన ఫలితాలు సమాజానికి అందుతాయని ముఖ్యమంత్రి హూడా ప్రజలకు వివరించారు. మహిళా భ్రూణ హత్యలను అరికట్టటంలో చర్యలు చేపట్టి తమ పంచాయతి సమాజంలో సవ్యమైన మార్పులు ఏ రకంగా తీసుకు రావచ్చనేది చూపుతూ ఆదర్శంగా ఉందని ఇతర సామాజిక సంస్ధలకు ఒక మంచి ఉదాహరణా నిలిచి వుందని ఆయన కొనియాడారు.



Click it and Unblock the Notifications











