గర్భిణీ స్త్రీ అరటిపండు ఎందుకు తినాలి?

By B N Sharma

Pregnant Women Need to Eat Bananas
బిడ్డను ప్రసవంచే సమయంలో మహిళల మరణాలకు కారణం ఐరన్ లోపించటం, రక్తహీనత ఏర్పడటం. ఈ రకమైన దుర్ఘటనలను ఎదుర్కొనకుండా వుండటానికి గాను గర్భిణీ స్త్రీలకు అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తారు.

గర్భవతికి అధిక శక్తి కావాలి. అరటిపండు అధిక శక్తినిస్తుంది. అనేక విటమిన్లు వుంటాయి. ప్రతిరోజూ గర్భిణీ స్త్రీ రెండు అరటిపండ్లు తింటే ఐరన్ కొరతతో వచ్చే రక్తహీనత నివారించవచ్చు. అరటిపండులో గర్భవతికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ కూడా వుంటుంది. ఇది కడుపులోని పిండానికి కూడా ఆవశ్యకమే అంటారు వైద్యులు. గర్భిణీ స్త్రీకి ఉదయ వికారం కలుగకుండా విటమిన్ బి 6 అవసరం. విటమిన్ బి 6 అరటిపండులో వుంటుంది.

ఒక అరటిపండులో 467 మి.గ్రా.పొటాషియం వుంటుంది. గర్భవతికి ప్రతిరోజూ 2000 మి.గ్రా పొటాషియం కావాలి. ఇదిలోపిస్తే, గర్భవతిలో కాళ్ళు రక్తం అందక కొంకర్లుపోయే ప్రమాదం వుంది. కనుక పొటాషియం గర్భవతికి సమకూరడం ఎంతో అవసరం. కనుక అన్నీ వున్న అరటిపండు గర్భిణీ స్త్రీకి ఈ దశలో ఎంతో మేలు చేస్తుంది.

Story first published: Wednesday, March 21, 2012, 10:43 [IST]
Desktop Bottom Promotion