Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీ స్త్రీలు ఏ వైపుకు తిరిగి పడుకొటే సురక్షితం...

గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరపు బరువు పెరగడం, వయసు మీరిన తర్వాత తల్లి కావడం, తల్లి పేగు పరిస్థితి, గర్భస్థ శిశువుకి కావసినంత నీరు లేకపోవడం, చివరి సమయంలో బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం వంటివి బిడ్డ పుట్టక ముందే చనిపోవడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అయినప్పటికీ గర్భిణులు పడుకునే విధానం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ దేశపు "అక్లాండ్ యూనివర్శిటీ" పరిశోధనలో తేలింది.
ప్రసవానికి ముందు బిడ్డ చనిపోయే విషయమై పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధనలో గర్భిణులు కుడి వైపుకు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డ చనిపోయే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువవుతాయని తెలిసింది. దానితోపాటు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల 1000 మందిలో నలుగురు మాత్రమే చనిపోవడం జరుగుతుందని కూడా పరిశోధకులు తెలియజేశారు.
గర్భిణులు నిద్రపోయే సమయంలో తిన్నగా పడుకోకూడదు, ఒక ప్రక్కకు తిరిగే పడుకోవాలి. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడైంది.
తల్లికీ, బిడ్డకీ మధ్య సంబంధాన్ని ఏర్పరచే తల్లి ప్రేగులో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ బిడ్డలు చనిపోవడం జరుగుతుంది. పోషక శక్తి లోపం, ఆక్సిజన్ లోపం, గర్భసంచిలో ఉమ్మినీరు లోపం మొదలైనవి కూడా బిడ్డలు చనిపోవడానికి కారణమౌతాయని తెలియజేశారు. చివరి నిముషం వరకూ బిడ్డ గుండె చప్పుడు సరిగ్గా ఉందా? లేదా?, లోపల బిడ్డ పరిస్థితి ఎలా ఉంది?, కదలికలు ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి స్కాన్ తీయించడం అవసరమని వైద్యులు తెలిపారు.
గర్భస్థ శిశువు చనిపోకుండా ఉండేందుకు గర్భిణులు చివరి రెండు నెలల్లో అతి జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలిపారు. పోషక విలువలు కలిగిన పండ్లను తినాలి. ఇంకా సుఖ ప్రసవమయ్యేందుకు కాల్షియం కలిగిన పాలు, జ్యూస్, పెరుగు మొదలైనవాటిని క్రమం తప్పకుండా ఆహారంతో పాటు సేవించాలి.



Click it and Unblock the Notifications