Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
గర్భిణీ స్త్రీలు ఏ వైపుకు తిరిగి పడుకొటే సురక్షితం...

గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరపు బరువు పెరగడం, వయసు మీరిన తర్వాత తల్లి కావడం, తల్లి పేగు పరిస్థితి, గర్భస్థ శిశువుకి కావసినంత నీరు లేకపోవడం, చివరి సమయంలో బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం వంటివి బిడ్డ పుట్టక ముందే చనిపోవడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అయినప్పటికీ గర్భిణులు పడుకునే విధానం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ దేశపు "అక్లాండ్ యూనివర్శిటీ" పరిశోధనలో తేలింది.
ప్రసవానికి ముందు బిడ్డ చనిపోయే విషయమై పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధనలో గర్భిణులు కుడి వైపుకు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డ చనిపోయే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువవుతాయని తెలిసింది. దానితోపాటు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల 1000 మందిలో నలుగురు మాత్రమే చనిపోవడం జరుగుతుందని కూడా పరిశోధకులు తెలియజేశారు.
గర్భిణులు నిద్రపోయే సమయంలో తిన్నగా పడుకోకూడదు, ఒక ప్రక్కకు తిరిగే పడుకోవాలి. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడైంది.
తల్లికీ, బిడ్డకీ మధ్య సంబంధాన్ని ఏర్పరచే తల్లి ప్రేగులో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ బిడ్డలు చనిపోవడం జరుగుతుంది. పోషక శక్తి లోపం, ఆక్సిజన్ లోపం, గర్భసంచిలో ఉమ్మినీరు లోపం మొదలైనవి కూడా బిడ్డలు చనిపోవడానికి కారణమౌతాయని తెలియజేశారు. చివరి నిముషం వరకూ బిడ్డ గుండె చప్పుడు సరిగ్గా ఉందా? లేదా?, లోపల బిడ్డ పరిస్థితి ఎలా ఉంది?, కదలికలు ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి స్కాన్ తీయించడం అవసరమని వైద్యులు తెలిపారు.
గర్భస్థ శిశువు చనిపోకుండా ఉండేందుకు గర్భిణులు చివరి రెండు నెలల్లో అతి జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలిపారు. పోషక విలువలు కలిగిన పండ్లను తినాలి. ఇంకా సుఖ ప్రసవమయ్యేందుకు కాల్షియం కలిగిన పాలు, జ్యూస్, పెరుగు మొదలైనవాటిని క్రమం తప్పకుండా ఆహారంతో పాటు సేవించాలి.



Click it and Unblock the Notifications