Latest Updates
-
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.!
గర్భిణీ స్త్రీలకు ఐరన్ యొక్క ప్రాముఖ్యత ..!?ఐరన్ లోపంతో ఏం జరుగుతుంది
సహజంగా ఇల్లల్లో ఎవరై గర్భ దాల్చినట్లైతే వారి పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో వారు మాత్రమే కాదు, తెలిసిన వారు, బందువులు గర్భిణి మహిళకు వివిధ రకాలుగా సూచనలిస్తుంటారు. మంచి ఆహారం తినమని, విశ్రాంతి సూచిస్తుంటారు. ముఖ్యంగా గర్భదాల్చినప్పటి నుండి ఇద్దరి కోసం భోజం చేయాలని సూచిస్తుంటారు !అది నిజమేనా? పరోక్షంగా వాస్తవమనే చెప్పవచ్చు,గర్భధారణ సమయంలో గర్భిణికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి, ఎక్కువ ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకొన్నప్పుడు తల్లి పాటు బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు.
గర్భధారణ సమయంలో మంచి పోషకారంతో డైట్ ను మెయింటైన్ చేయమని సూచిస్తుంటారు . ఎక్కువ ఆహారం తీసుకోవడం తగ్గించాలి, తల్లి తీసుకొనే పోషకాహారం బిడ్డకు కూడా అందుతుంది కాబట్టి, మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి.అప్పుడే కడుపులో పెరిగే బిడ్డకూ తల్లి ద్వారా చేరుతుంది.
చాలా సందర్భాల్లో తల్లి తీసుకొనే పోషకార లోపం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా హాని కలుగుతుంది. తల్లి సరైన పోషకారణం తీసుకోనట్లైతే కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. ఇంకా బిడ్డ బరువు తక్కువగా ఉండటం, పుట్టుకలో లోపాలతో పుట్టే అవకాశాలు ఎక్కువ.

అందువల్ల, గర్భం దాల్చిన వెంటనే గైనకాలజిస్ట్ లను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించి ఎలాంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. విటమిన్స్ మరియు న్యూట్రీషియన్ ఎంత పరిమాణంలో తీసుకుంటే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారన్న విషయం తెలుసుకోవాలి
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది . ఎందుకంటే ఐరన్ ఆరోగ్యకరమైన మరియు రెడ్ బ్లడ్ సెల్స్ కోసం మరియు హీమోగ్లోబిన్ ఏర్పాటుకు ఐరన్ అత్యంత ముఖ్యమైన మూలకం. గర్భం దాల్చిన ప్రతియొక్క మహిళకు ఇది చాలా అవసరం.
అందువల్ల, గర్భం దాల్చిన తర్వాత తల్లి తీసుకొనే ఐరన్ ఫుడ్స్ నార్మల్ గా కంటే రెండింతలు పెంచాల్సి ఉంటుంది .
పోషకాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీ శరీరం క్రమంగా పెరుగుతుంది,కాబట్టి తల్లి తీసుకొనే ఐరన్ ఫుడ్స్ వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బేబీకి సపోర్ట్ గా ఉంటుంది.

అందువల్ల ఆరోగ్య కరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ ఎక్కుగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి . శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలలో అనీమియా నివారిస్తుంది.ఇంకా గర్భిణీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . దాంతో తల్లి మరియు బిడ్డ ఎలాంటి వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా ఉంటారు .
గర్భినీ కడుపులో బిడ్డ రక్షణ కవచంగా ఐరన్ ప్లాసాంటా ఏర్పాటకు సహాయపడుతుంది.ఇంకా, మంచి ప్రసవానికి , బిడ్డ బరువు తక్కువగా లేకుండా మంచి బరువు కలిగి ఉండటకు సహాయపడుతుంది .
నిపుణులు అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీ రోజూ 27గ్రాముల ఐరన్ ఫుడ్స్ ను తీసుకుంటూ, ఆరోగ్యంగా నిర్వహిచండానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా ఆమె తీసుకొనే ఆహారాల్లో కొన్ని ప్రత్యేకమైన ఐరన్ ఫుడ్స్ ఆకుకూరలు, పనీర్, చికెన్, బీఫ్ , ద్రాక్ష, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్ మొదలగునవి ఆమె రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలని సూచిస్తున్నారు .
అలాగే డాక్టర్ల సూచన ప్రకారం ,తల్లి ఐరన్ సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు, క్యాప్స్యూల్ లేదా టానిక్ రూపంలో తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications