Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గర్భవతిగా ఉన్నసమయంలో అధిక చక్కెర పదార్థాలు తీసుకోవటం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం రావచ్చు.
తమ ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల, కడుపుతో ఉన్న సమయంలో, ఆ తర్వాత పిల్లల్లో అలర్జీ, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది.
క్వీన్ మేరి యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం, అధిక చక్కెర తీసుకునే తల్లుల్లో- ఆహారం, పానీయాల్లో, సహజంగా ఉండే చక్కెర ఎక్కువవుండే తేనె, సిరప్స్, పళ్లరసాలు- వీటన్నిటి వల్ల పిల్లల్లో 38శాతం అలర్జీ, 73 శాతం ఇద్దరిలో అలర్జీ, 101శాతం అలర్జీతో వచ్చే ఆస్తమా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

శాస్త్రవేత్తలు మరింత వివరిస్తూ తల్లులు అధికంగా తీసుకునే చక్కెర పదార్థాల వల్ల పోస్ట్ నేటల్ అలర్జిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ను సృష్టించి, ఎదిగే బిడ్డ ఊపిరితిత్తిలో అలర్జిక్ వాపును తేవచ్చని తెలిపారు.
ముఖ్యంగా, చంటిబిడ్డ చిన్నప్పుడంతా అధిక చక్కెర ఆహారం తీసుకోకపోయినా, దీనితో దానికి సంబంధం లేదని ఈ విశ్లేషణలో పరిశోధకులు తేల్చారు.
యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనానికి, 9000 వేల తల్లిబిడ్డల జంటలు పాల్గొన్నారు.

తల్లులు గర్భసమయంలో తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి, 7-9 ఏళ్ళ మధ్య పిల్లలకి వచ్చే ఆస్తమా, జలుబు, హే జ్వరం, ఎక్జిమా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకి మధ్య సంబంధాన్ని ఈ విశ్లేషణ తెలిపింది.
ఈ ఫలితాల ప్రకారం కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి అటోపీ ఆస్తమాకి- అలర్జీతో వచ్చే జలుబు, ఆస్తమా, ఎక్జిమా వంటి చర్మవ్యాధిని పెంచే జన్యుపరమైన చర్యకి దారితీస్తుందని తెలిసింది.
ఏది ఎలా వున్నా, ఎక్జిమా లేదా హే ఫీవర్ కి మాత్రం ఏ సంబంధం లేదని తెలిసింది.

క్యూఎంయూఎల్ కి చెందిన ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త సియెఫ్ షహీన్ మాట్లాడుతూ, “ఈ విశ్లేషణల ప్రకారం కేవలం అధిక చక్కెర పదార్థాల వల్లనే ఈ అలర్జీ, ఆస్తమాలు పిల్లల్లో వస్తుందని చెప్పలేం.” అని అన్నారు.
కానీ మరీ ఎక్కువ చక్కెర పదార్థాల వాడకం చూసి, ఈ పరిశోధనను మరింత త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నది,”అని జతచేసారు.
“ఇదే సమయంలో, మేము గర్భిణీ స్త్రీలకు అధిక చక్కెరలేని ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నాం.” అని తెలిపారు.



Click it and Unblock the Notifications