Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గర్భవతిగా ఉన్నసమయంలో అధిక చక్కెర పదార్థాలు తీసుకోవటం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం రావచ్చు.
తమ ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల, కడుపుతో ఉన్న సమయంలో, ఆ తర్వాత పిల్లల్లో అలర్జీ, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది.
క్వీన్ మేరి యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం, అధిక చక్కెర తీసుకునే తల్లుల్లో- ఆహారం, పానీయాల్లో, సహజంగా ఉండే చక్కెర ఎక్కువవుండే తేనె, సిరప్స్, పళ్లరసాలు- వీటన్నిటి వల్ల పిల్లల్లో 38శాతం అలర్జీ, 73 శాతం ఇద్దరిలో అలర్జీ, 101శాతం అలర్జీతో వచ్చే ఆస్తమా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

శాస్త్రవేత్తలు మరింత వివరిస్తూ తల్లులు అధికంగా తీసుకునే చక్కెర పదార్థాల వల్ల పోస్ట్ నేటల్ అలర్జిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ను సృష్టించి, ఎదిగే బిడ్డ ఊపిరితిత్తిలో అలర్జిక్ వాపును తేవచ్చని తెలిపారు.
ముఖ్యంగా, చంటిబిడ్డ చిన్నప్పుడంతా అధిక చక్కెర ఆహారం తీసుకోకపోయినా, దీనితో దానికి సంబంధం లేదని ఈ విశ్లేషణలో పరిశోధకులు తేల్చారు.
యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనానికి, 9000 వేల తల్లిబిడ్డల జంటలు పాల్గొన్నారు.

తల్లులు గర్భసమయంలో తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి, 7-9 ఏళ్ళ మధ్య పిల్లలకి వచ్చే ఆస్తమా, జలుబు, హే జ్వరం, ఎక్జిమా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకి మధ్య సంబంధాన్ని ఈ విశ్లేషణ తెలిపింది.
ఈ ఫలితాల ప్రకారం కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి అటోపీ ఆస్తమాకి- అలర్జీతో వచ్చే జలుబు, ఆస్తమా, ఎక్జిమా వంటి చర్మవ్యాధిని పెంచే జన్యుపరమైన చర్యకి దారితీస్తుందని తెలిసింది.
ఏది ఎలా వున్నా, ఎక్జిమా లేదా హే ఫీవర్ కి మాత్రం ఏ సంబంధం లేదని తెలిసింది.

క్యూఎంయూఎల్ కి చెందిన ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త సియెఫ్ షహీన్ మాట్లాడుతూ, “ఈ విశ్లేషణల ప్రకారం కేవలం అధిక చక్కెర పదార్థాల వల్లనే ఈ అలర్జీ, ఆస్తమాలు పిల్లల్లో వస్తుందని చెప్పలేం.” అని అన్నారు.
కానీ మరీ ఎక్కువ చక్కెర పదార్థాల వాడకం చూసి, ఈ పరిశోధనను మరింత త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నది,”అని జతచేసారు.
“ఇదే సమయంలో, మేము గర్భిణీ స్త్రీలకు అధిక చక్కెరలేని ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నాం.” అని తెలిపారు.



Click it and Unblock the Notifications











