Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
మైసూర్ బోండా గుండ్రంగా, లోపల స్పాంజిలా రావాలంటే ఇలా చేయాల్సిందే!
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన బ్రేక్ ఫాస్ట్ లలో మైసూర్ బోండా ఒకటి. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా స్పాంజిలా ఉండే ఈ బోండాలను ఇష్టపడని వారుండరు. అయితే అదే రుచితో, అదే పర్ఫెక్షన్ తో హోటల్ స్టైల్ మైసూర్ బోండాను ఇంట్లోనే చేస్తుంటే రావట్లేదని చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. ఆకృతి కరెక్ట్ గా రావట్లేదని, లోపల పిండి ఉడకటం లేదని ఇలా చెబుతుంటారు. అయితే హోటల్ స్టైల్ లో, అంతకు మించిన రుచితో మైసూర్ బోండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మైసూర్ బోండా తయారీకి కావలసిన పదార్థాలు
-మైదా పిండి
-పుల్లటి పెరుగు
-వంట సోడా (బేకింగ్ సోడా)
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-అల్లం
-కరివేపాకు
-ఉప్పు
-ఆయిల్
మైసూర్ బోండా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పుల్లటి పెరుగు వేయండి. ఈ పెరుగుతున్న 5 నిమిషాల పాటు బాగా బీట్(గిలక్కొట్టడం)చేయాలి. దీంతో పెరుగు మంచి సాఫ్ట్ గా, క్రీమీ టెక్చర్ వస్తుంది.
-తర్వాత పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి.
-తర్వాత పెరుగు మిశ్రమంలో 1 కప్పు మైదా పిండి వేసి, 1 కప్పు వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని పెరుగు మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకున్నాక మిశ్రమం చేత్లో లాగుతుంటే సాగుతున్నట్లు రావాలి. 5 నిమిషాల పాటు ఈ పిండి మొత్తాన్ని చేత్తోనే కిందకి కొడుతూ పైకి తీస్తున్నట్లుగా బీట్ చేయాలి.
-బీట్ చేస్తూ పిండిని కలుపుకున్న తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, అర టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. అన్నీ కలిసేట్లు బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఈ పిండి మీద ప్లేట్ లేదా ఒక క్లాత్ ని పెట్టి కనీసం 1 గంట సేపు అలా వదిలేయాలి. పిండి ఎంత ఎక్కువ సేపు నానితే మైసూర్ బోండా అంత చక్కగా వస్తుంది.
-1 గంటసేపు తర్వాత చూస్తే పిండి ఫ్లఫీగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని అస్సలు కదిలించకూడదు.
-స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేశాక మంటను సిమ్ లో ఉంచండి. పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాండీలో ఆయిల్ లోకి వదలాలి.తర్వాత మంటను మీడియంలోకి మార్చి బోండాలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లో నుంచి బయటకు తీసేయాలి. అంతే పర్ఫెక్ట్ మైసూర్ బోండా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications