Latest Updates
-
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే.. -
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.! -
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.!
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అద్భుతమైన తీపి పదార్థాలలో వేరుశెనగ మిఠాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. స్కూల్ వదిలిన వెంటనే పిల్లలు షాప్ కి పరుగెత్తి కొనుక్కునే ఇష్టమైన స్వీట్ ఇది. అప్పట్లో పల్లి పట్టీ కొరుక్కుంటూ తింటే వచ్చే మజానే వేరు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మిఠాయి పోషకాల గని. పల్లీలలో ప్రోటీన్లు మెండుగా ఉంటే,ఇందులో వాడే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బయట దొరికే రంగుల స్వీట్ల కంటే, ఇంట్లో మన చేతులతో స్వచ్ఛంగా చేసుకునే పల్లి మిఠాయి ఎంతో బెటర్.

వేరుశెనగ మిఠాయి తయారీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - అర కిలో
బెల్లం - 200 గ్రాములు
నీళ్లు - పాకానికి సరిపడా
నెయ్యి - కొద్దిగా
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి!
వేరుశెనగ మిఠాయి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో వేరుశెనగ గుళ్ళను వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. పల్లీలు బాగా వేగాక స్టవ్ ఆపేసి, వాటిని చల్లారనిచ్చి, చేత్తో నలుపుతూ పొట్టు మొత్తం తీసేసి శుభ్రం చేసుకోవాలి.
-ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా కాకుండా, కొద్దిగా బరకగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మిఠాయి తినేటప్పుడు పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టి అందులో బెల్లం తురుము వేయాలి. బెల్లం కరగడానికి తగినన్ని నీళ్లు పోసి, మధ్యస్థ మంట మీద ఉడికించాలి. బెల్లం కరిగి పాకం చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఉడుకుతున్న బెల్లం పాకం ఒక చుక్క వేయండి. ఆ పాకం నీటిలో కరిగిపోకుండా, చేత్తో పట్టుకుంటే ఒక ఉండలా గట్టిగా వస్తే పాకం రెడీ అయినట్లే.
-పాకం రాగానే మంట తగ్గించి, ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వేరుశెనగ పొడిని అందులో వేసి బాగా కలపాలి. పాకం పల్లీలకు పూర్తిగా పట్టేలా కలుపుకుని స్టవ్ ఆపేయాలి.
-ఈ మిశ్రమాన్ని వేరొక వెడల్పాటి పళ్ళెంలోకి మార్చుకోండి. మీ రెండు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన ఆకారంలో గుండ్రటి లడ్డూల్లా లేదా చదునుగా బిళ్ళల్లా చేసుకోవాలి.
-తయారు చేసుకున్న వేరుశెనగ మిఠాయిలను ఒక అరగంట పాటు గాలికి ఆరనివ్వాలి. అవి చల్లబడి గట్టిపడిన తర్వాత కరకరలాడే వేరుశెనగ మిఠాయిలు తినడానికి రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications