Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే అటుకుల పొంగల్..తయారీ ఎంతో సులభం!
సాధారణంగా పొంగల్ అనగానే మనకు బియ్యం, పెసరపప్పుతో చేసే వంటకం గుర్తొస్తుంది. అయితే బియ్యానికి ప్రత్యామ్నాయంగా, మరింత సులభంగా, వేగంగా,ఆరోగ్యకరంగా చేసుకోగలిగే వంటకమే అటుకుల పొంగల్.
దీనిని పోహా పొంగల్ అని కూడా అంటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. అటుకుల పొంగల్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-నెయ్యి
-అటుకులు
-మిరియాలు
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-ఆవాలు
-అల్లం
-జీడిపప్పు
-కరివేపాకు
-పసుపు
-కొత్తిమీర
-నీళ్లు
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెసర పప్పు వేసి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన నీటిని వంపేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె లేదా కుక్కర్ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. దీంతో పప్పులో ఉండే పప్పు వాసన అంతా పోయి పొంగల్ రుచిగా ఉంటుంది.
-పెసరపప్పు లైట్ గా కలర్ మారిన తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోయండి. ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 12 మిరియాలు వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ పై మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చేవరకు(పప్పు మెత్తగా ఉడికే వరకు)ఉడికించాలి.
- ఒక బౌల్ లో 1 కప్పు మందపాటి అటుకులను వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి
-కుక్కర్ లో పప్పు ఉడికిన తర్వాత పప్పు కొంచెం పలుకుగా ఉంటే కవ్వంతో కొంచెం మెదుపుకోండి.
-ఇప్పుడు కుక్కర్ లో ఉడికిన పప్పులో కడిగిన అటుకులు వేయండి. ఇందులోనే ఒకటిన్నర గ్లాసుల నీళ్లు(400 ml)నీళ్లు పోసి కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి మీడియం మంట పప్పు అటుకుల మిశ్రమాన్ని 3-4 నిమిషాలు ఉడికించాలి.
-ఉడికేటప్పుడు పప్పుపై తేటలాగా నురగ వస్తుంది. దానిని గరిటతో తీసేయాలి. మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడే అందులోకి తాలింపు రెడీ చేసుకోవాలి.
-తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టీస్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయల ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి లైట్ గా ఫ్రై చేశాక అందులో కచ్చాపచ్చగా దంచిన అర టీస్పూన్ మిరియాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి.
-తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నాక ఇందులో మరోపక్కన ఉడుకుతున్న అటుకులు పప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం బాగా కలపండి. మరో 2-3 నిమిషాలు ఉడికిస్తే దగ్గరపడి కిచిడిలా అవుతుంది. మరీ ఎక్కువ దగ్గరపడే వరకు ఉడికించొద్దు.
-చివరగా అందులో పిడికెడు కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆపేయండి. అంతే హెల్దీ అటుకుల పొంగల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
