Latest Updates
-
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే! -
ఈనాటి దాంపత్యానికి ఆదర్శంగా నిలిచే ఆనాటి ప్రేమకథలు.. ఒక్కో కథలో ఒక్కో పాఠం.! -
కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్! -
చిన్న కాయ.. పెద్ద ప్రయోజనాలు: వాక్కాయలతో ఈ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
ఉద్యోగులు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. ఈ పది ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే.! -
మీ మూడ్ ని తక్షణమే రిఫ్రెష్ చేసే కుంకుమపువ్వు ఐస్డ్ టీ..5 నిమిషాల్లో చేసుకోండిలా.. -
ఈ రోజు సూర్య గోచారం.. ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.! -
జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. భాగ్యనగరంలో అట్టహాసంగా ఊరేగింపు.. రథయాత్ర ప్రాముఖ్యత ఇదే.!
బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు!
దక్షిణ భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా బెంగళూరులో మెంథ్యా బాత్ చాలా ప్రాచుర్యం పొందింది. బెంగళూరులోని అనేక హోటల్స్, ఇళ్లలో ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనంగా దీనిని విరివిగా తీసుకుంటారు. దీనిని మెంతి కూర రైస్ అని కూడా అంటారు.
ఈ వంటకం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనది. బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం- 2 కప్పులు
మెంతి కూర - 2 పెద్ద కట్టలు
బఠానీలు - అర కప్పు
ఉల్లిపాయ - 2
టమాటో - 2
నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
మరాఠీ మొగ్గ - 1
ఉప్పు -సరిపడా
పసుపు - చిటికెడు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చి మిరపకాయలు - 7
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
సోంపు - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి. సువాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూరను వేయాలి. మెంతి కూరలోని పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 3-4 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఆకు పూర్తిగా వాడిపోయిన తర్వాత టమాటో ముక్కలు, పసుపు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించాలి.
-మసాలా వేగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు మసాలాతో కలిపి వేయించాలి. ఇప్పుడు బియ్యానికి తగిన మోతాదులో నీరు పోయాలి(1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు), రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మామూలు గిన్నెలో అయితే మూత పెట్టి అన్నం ఉడికే వరకు సన్నని మంటపై ఉంచాలి.
-కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలపాలి. అంతే వేడి వేడి, ఘమఘమలాడే బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్ రెడీ. దీనిని పెరుగు పచ్చడి లేదా అప్పడాలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications