Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
Best Breakfast: బరువు తగ్గాలనుకుంటే ఈ దోశలు తినాలి..ఆయిల్ లేని చట్నీతో..ఎలా చేసుకోవాలంటే
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏవి పడితే అవి తిని ఆరోగ్యం పాడు చేసుకునే బదులు జొన్న దోశలు చేసుకొని తినడం ఉత్తమం. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం దీంతో పొందవచ్చు. జొన్నలు మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ప్రొటీన్ శాతం అధికంగా ఉండే జొన్నలు గుండెకు మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించి, జీర్ణక్రియను పెంచే అప్పుడప్పుడైనా మన డైట్ లో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ జొన్నలతో పొద్దున్నే దోశ చేసుకొని తింటే బరువు కూడా తగ్గొచ్చు. అంతేకాకుండా ఇందులోకి ఆయిల్ లేకుండా చేసే చట్నీని కలుపుకొని తింటే అదిరిపోతుంది. జొన్న దోశ,ఆయిల్ లేని చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-మినపగుళ్లు
-మెంతులు
-జొన్నలు
-వెల్లుల్లి
-ఎండుమిర్చి
-ఉప్పు
-నీళ్లు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 1/3 కప్పు వేయించిన పల్లీలు, పెద్ద ముక్కలుగా కట్ చేసిన 3-4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, కాడలతో సహా కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఓ గిన్నెలో ముప్పావు కప్పు పొట్టు తీసిన మినప గుళ్లు, పావు కప్పు పొట్టుతో ఉండే మినపగుళ్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 5 ఎండుమిర్చి వేసి ఇందులో నీళ్లు పోసి వీటన్నింటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు పోసి కనీసం 5-6 గంటలు నాననివ్వాలి.
-ఇప్పుడు మరో గిన్నెలో 2 కప్పుల తెల్ల జొన్నలు వేసి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు పోసి 6-8 గంటలపాటు నానబెట్టాలి.
-కనీసం 6 గంటల తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన మినపగుళ్ల మిశ్రమం, అరకప్పు అటుకులు కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మిగిలిన అన్నంతో టేస్టీ,కరకరలాడే వడలు..డీప్ ఫ్రై లేకుండానే..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత నానబెట్టిన జొన్నలు కూడా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు జొన్న పిండి,పప్పు పిండిని మెత్తం కలిపి మూతపెట్టి 6-8 గంటలు అలా వదిలేయాలి.
-8 గంటల తర్వాత పిండి పులిసి పైకి తేలుతుంది. అప్పుడు గిన్నెలోకి ఎంతకావాలో అంత పిండి తీసుకొని అందులో ఉప్పు, నీళ్లు పోసి కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దోశలు పోసుకోవడమే. అంతే కమ్మని జొన్న దోశలు రెడీ. వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూనె లేని చట్నీతో కలిపి తింటుంటే ఆ మజా వేరే లెవల్లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





