Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నోట్లో ఇట్టే కరిగిపోయే మక్మాల్ పనీర్..రుచి అమోఘం!
మక్మాల్ పనీర్..పేరుకు తగ్గట్టే ఈ కూర చాలా మృదువుగా, క్రీమీగా ఉంటుంది. మక్మాల్ అంటే హిందీలో వెల్వెట్ అని అర్థం. ఈ కూర టెక్చర్ చాలా స్మూత్ గా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.
ఇది సాధారణ పనీర్ బటర్ మసాలా కంటే భిన్నంగా, కాజు బటర్ మిశ్రమంతో లేత పసుపు రంగులో ఉంటుంది. మక్మాల్ పనీర్ కర్రీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-పాలు
-వెనిగర్
-లవంగ మొగ్గలు
-దాల్చిన చెక్క
-ఉల్లిపాయ
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కర్బూజ గింజలు
-ఫ్రెష్ క్రీమ్
-వెన్న
-నూనె
-పసుపు
-టమాటో తరుగు
-బిర్యానీ ఆకు
-క్యాప్సికమ్
-జీలకర్ర పొడి
-వెల్లుల్లి తరుగు
-యాలకులు
-ధనియాల పొడి
-కసూరి మేతి
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా 1 లీటరు పాలను కలుపుతూ మరిగించాలి. 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆపేసి దించేయాలి.
-ఇప్పుడు అరకప్పు నీళ్లలో 1/3 కప్పు వెనిగర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మరిగించిన పాలలో కొద్ది కొద్దిగా చేర్చుకుంటూ నెమ్మదిగా గరిటతో కలిపాయి. దీంతో పాలకు పాలు,నీళ్లకు నీళ్లు విడిపడతాయి.
-విడిపడగానే పాల మిశ్రమం(పాల మిశ్రమం) తీసి ఓ జల్లెడలో వేసి పక్కన పెట్టుకోండి. దీని మీద చల్లటి నీళ్లను పోసి కలిపిస్తే వెనిగర్ లోని పులుపు మొత్తం దిగిపోతుంది. ఇలాగే పనీర్ మిశ్రమాన్ని జల్లెడలో వదిలేయండి.
-తర్వాత గ్రేవీ కోసం మిక్సీ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కర్బూజ గింజలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, 3లవంగ మొగ్గలు వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల వెన్న, 2 చెంచాల నూనె వేడి చెయ్యాలి. వెన్న కరుగుతూ ఉన్న సమయంలోనే అందులో చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి కాస్త వేగితే చాలు మరీ ఎర్రగా వెల్లుల్లి వేగకూడదు.
-వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులో 1/3 కప్పు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లి లేత గులాబీ రంగులోకి వచ్చేవరకు వేపాలి.
-ఉల్లిపాయ తరుగు రంగు మారుతున్న సమయంలో అందులో 1 టేబుల్ స్పూన్ ప్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపాక అరకప్పు టమాటో తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ వేయించిన ధనియాల పొడి, కాస్త నిలిపిన కసూరి మేతీ, కొంచెం నీరు వేసి వేయించుకోవాలి.
-నూనె పైకి తేలుతున్న సమయంలో అందులో 1/4 కప్పు సన్నని క్యాప్సికమ్ తరుగు వేసి 2-3 నిమిషాలు వేయించాక పాన్ లోనే 1/3 కప్పు నీళ్లు పోసి వేయించుకుంటే క్యాప్సికమ్ మెత్తబడుతుంది.
-కూర దగ్గరపడ్డాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు కర్జూజ పేస్ట్ వేసి కప్పుంబావు నీళ్లు కూడా పోసి కలుపుకొని కూరని దగ్గరగా,నూనె పైకి తేలేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత జల్లెడలో ఉంచిన పనీర్ ను తీసి స్టవ్ మీద ఉన్నకూరలో వేసి,అరకప్పు కాచిన పాలు కూడా పోసి కలిపి కాస్త ఉడుకుపట్టనివ్వాలి.
-కూర కాస్త ఉడుకుపట్టిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కూరలో 2టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు కొంచెం వేసి కలుపుకోండి. అంతే మక్మాల్ పనీర్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













