Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Bhogi special recipe: చెరుకు పానకంతో సగ్గుబియ్యం పాయసం..తిరుగులేని రుచి,ఇదిగో రెసిపి
సంక్రాంతికి స్పెషల్ గా ఇంట్లో పొంగలి చేసుకుంటుంటాం. అయితే పాలు అవసరం లేకుండా చెరుకు రసంతో సగ్గుబియ్యం పాయం చేస్తే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. ఈ భోగి పండుగ రోజున కొత్తగా ఏదైనా స్వీట్ రెసిపి చేసి ఇంట్లో వాళ్లకి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చెరుకు రసం, పెసరపప్పు ఉపయోగించి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-సగ్గుబియ్యం
-చెరుకు రసం
-పచ్చి కొబ్బరి ముక్కలు
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు
-యాలకల పొడి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద కప్పునిండా సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-వేయించిన ఒక చిన్న కప్పు పెసరపప్పుని కూడా రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం మీగడ వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద కప్పు నిండా చెరుకు పానకం పోసి మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో ఉడికించిన సగ్గుబియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత యాలకల పొడి దానిమీద చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












