Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Bhogi special recipe: చెరుకు పానకంతో సగ్గుబియ్యం పాయసం..తిరుగులేని రుచి,ఇదిగో రెసిపి
సంక్రాంతికి స్పెషల్ గా ఇంట్లో పొంగలి చేసుకుంటుంటాం. అయితే పాలు అవసరం లేకుండా చెరుకు రసంతో సగ్గుబియ్యం పాయం చేస్తే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. ఈ భోగి పండుగ రోజున కొత్తగా ఏదైనా స్వీట్ రెసిపి చేసి ఇంట్లో వాళ్లకి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చెరుకు రసం, పెసరపప్పు ఉపయోగించి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-సగ్గుబియ్యం
-చెరుకు రసం
-పచ్చి కొబ్బరి ముక్కలు
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు
-యాలకల పొడి

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద కప్పునిండా సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-వేయించిన ఒక చిన్న కప్పు పెసరపప్పుని కూడా రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం మీగడ వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద కప్పు నిండా చెరుకు పానకం పోసి మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో ఉడికించిన సగ్గుబియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత యాలకల పొడి దానిమీద చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications