Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Bhogi special recipe: చెరుకు పానకంతో సగ్గుబియ్యం పాయసం..తిరుగులేని రుచి,ఇదిగో రెసిపి
సంక్రాంతికి స్పెషల్ గా ఇంట్లో పొంగలి చేసుకుంటుంటాం. అయితే పాలు అవసరం లేకుండా చెరుకు రసంతో సగ్గుబియ్యం పాయం చేస్తే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. ఈ భోగి పండుగ రోజున కొత్తగా ఏదైనా స్వీట్ రెసిపి చేసి ఇంట్లో వాళ్లకి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చెరుకు రసం, పెసరపప్పు ఉపయోగించి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-సగ్గుబియ్యం
-చెరుకు రసం
-పచ్చి కొబ్బరి ముక్కలు
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు
-యాలకల పొడి

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద కప్పునిండా సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-వేయించిన ఒక చిన్న కప్పు పెసరపప్పుని కూడా రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం మీగడ వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద కప్పు నిండా చెరుకు పానకం పోసి మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో ఉడికించిన సగ్గుబియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత యాలకల పొడి దానిమీద చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications