Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బజ్జీ కాదు.. ఇది మిర్చి వడ..రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సాయంత్రం సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఈ సందర్భంలో సాధారణంగా ఇంట్లో చేసుకొని అయినా లేదా బజారుకు వెళ్లో సాయంత్రం సమయంలో మిర్చి బజ్జీలు తింటుంటాం. కానీ ఎప్పుడూ తినే బజ్జీలు కాకుండా, ఈసారి కొంచెం వెరైటీగా మిర్చితో వడ ట్రై చేసి చూడండి.
రాజస్తాన్ వీధుల్లో దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ రుచి అద్భుతంగా ఉంటుంది. పైన కరకరలాడే శనగపిండి కోటింగ్, లోపల ఘాటైన మిరపకాయ, దానిలోపల గుబాళించే బంగాళాదుంప మసాలా..తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఈ వడలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వాడే సుగంధ ద్రవ్యాలు, స్టఫింగ్. రాజస్తాన్ స్పెషల్ మిర్చి వడ మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ఉడికించి మెదిపిన బంగాళదుంపలు - 4 (పెద్దవి)
సోంపు- 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం - రుచికి తగినంత
ఆమ్చూర్ పొడి (మామిడి పొడి) - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
బజ్జీ మిరపకాయలు (లావుగా ఉండేవి)- 8
శనగ పిండి - 2 కప్పులు
వాము - అర టీస్పూన్
వంట సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఉడికించి, మెత్తగా చేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకోండి. అందులో సోంపు, ధనియాల పొడి, కారం, ఆమ్చూర్, గరం మసాలా, అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
-లావుగా ఉండే మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి నిలువుగా గాటు పెట్టి, లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మసాలాను మిరపకాయల లోపల నిండుగా కూరాలి. మిరపకాయ లోపలే కాకుండా, మిరపకాయ బయట కూడా కొంచెం బంగాళాదుంప మిశ్రమాన్ని అంటించాలి. దీనివల్ల వడ లావుగా, రుచిగా వస్తుంది.
-ఒక గిన్నెలో శనగ పిండి, ఉప్పు, వాము, చిటికెడు పసుపు వేసి కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ జారుగా కాకుండా, దోశ పిండి కంటే కొంచెం గట్టిగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి.
-స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టండి. మసాలా దట్టించిన మిరపకాయను శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో జాగ్రత్తగా విడవాలి.
-అన్ని వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే మిర్చి వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












