Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బజ్జీ కాదు.. ఇది మిర్చి వడ..రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సాయంత్రం సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఈ సందర్భంలో సాధారణంగా ఇంట్లో చేసుకొని అయినా లేదా బజారుకు వెళ్లో సాయంత్రం సమయంలో మిర్చి బజ్జీలు తింటుంటాం. కానీ ఎప్పుడూ తినే బజ్జీలు కాకుండా, ఈసారి కొంచెం వెరైటీగా మిర్చితో వడ ట్రై చేసి చూడండి.
రాజస్తాన్ వీధుల్లో దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ రుచి అద్భుతంగా ఉంటుంది. పైన కరకరలాడే శనగపిండి కోటింగ్, లోపల ఘాటైన మిరపకాయ, దానిలోపల గుబాళించే బంగాళాదుంప మసాలా..తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఈ వడలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వాడే సుగంధ ద్రవ్యాలు, స్టఫింగ్. రాజస్తాన్ స్పెషల్ మిర్చి వడ మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ఉడికించి మెదిపిన బంగాళదుంపలు - 4 (పెద్దవి)
సోంపు- 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం - రుచికి తగినంత
ఆమ్చూర్ పొడి (మామిడి పొడి) - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
బజ్జీ మిరపకాయలు (లావుగా ఉండేవి)- 8
శనగ పిండి - 2 కప్పులు
వాము - అర టీస్పూన్
వంట సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఉడికించి, మెత్తగా చేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకోండి. అందులో సోంపు, ధనియాల పొడి, కారం, ఆమ్చూర్, గరం మసాలా, అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
-లావుగా ఉండే మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి నిలువుగా గాటు పెట్టి, లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మసాలాను మిరపకాయల లోపల నిండుగా కూరాలి. మిరపకాయ లోపలే కాకుండా, మిరపకాయ బయట కూడా కొంచెం బంగాళాదుంప మిశ్రమాన్ని అంటించాలి. దీనివల్ల వడ లావుగా, రుచిగా వస్తుంది.
-ఒక గిన్నెలో శనగ పిండి, ఉప్పు, వాము, చిటికెడు పసుపు వేసి కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ జారుగా కాకుండా, దోశ పిండి కంటే కొంచెం గట్టిగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి.
-స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టండి. మసాలా దట్టించిన మిరపకాయను శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో జాగ్రత్తగా విడవాలి.
-అన్ని వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే మిర్చి వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












