Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇడ్లీ, దోసెలే కాదు.. వేడి అన్నంలోకి అదిరిపోయే ఆంధ్రా పచ్చిమిర్చి చట్నీ..
పొద్దున్నే లేవగానే వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు ప్లేట్ లోకి రాగానే పక్కన ఏం చట్నీ ఉందా అని చూస్తాం. కానీ రోజువారీగా చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీలే మళ్లీ మళ్లీ తింటే ఎవరికైనా విసుగు రావడం సహజం. మీ నాలుక కొత్త రుచిని కోరుకుంటోందా? అయితే ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి.
దీనిని ఒక్కసారి రుచి చూశారంటే, ఇకపై ఇడ్లీ, దోసెలే కాదు, వేడి వేడి అన్నంలోకి కూడా ఇదే కావాలంటారు. ఈ చట్నీని ఒక్కసారి చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంటే ఉదయం హడావిడిలో చట్నీ చేసే పని తప్పుతుందన్నమాట. మరి ఇంత రుచికరమైన, సులభమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పచ్చిమిర్చి: 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: 10
వేరుశెనగ గుళ్లు (పల్లీలు): 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
పసుపు: చిటికెడు
నిమ్మరసం: 1 టీస్పూన్
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడగాలి. కడిగిన మిరపకాయలను పొడి గుడ్డతో తుడిచి కాసేపు ఆరనివ్వండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసి, మంటను మీడియంలో ఉంచి వేయించాలి.
-మిరపకాయలు మెత్తబడి, రంగు మారి, వాటి ఘాటు వాసన పోయేంత వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన నూనెలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి, వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మరొక చిన్న బాండీలో లేదా అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్లను వేసి, బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించుకుని చల్లార్చుకోవాలి. ఈ పల్లీలు పచ్చడికి మంచి చిక్కదనాన్ని, రుచిని ఇస్తాయి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి-జీలకర్ర మిశ్రమం, వేయించిన పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి.
-ఇది పచ్చడికి మంచి పులుపును ఇవ్వడమే కాకుండా నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా రుబ్బుకోవాలి.
-సిద్ధమైన పచ్చడిని తడి లేని గాజు సీసాలో తీసుకోండి. దీనిని ఫ్రిజ్లో ఉంచితే దాదాపు నెల రోజుల పాటు తాజాగానే ఉంటుంది.
-మీకు ఇష్టమైతే, చివరిగా ఆవాలు, మినపప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవచ్చు. ఇది పచ్చడి రుచిని మరింత పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









