Latest Updates
-
కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే! -
పల్లెటూరి స్టైల్ పానీపూరి ఇలా చేస్తే.. బయట దొరికే రుచిని మించిపోతుంది, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది! -
బంపరాఫర్..షూరిటీ లేకుండానే రూ.10 లక్షల లోన్..ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. -
ఎండల వేళ దంపతుల మధ్య గొడవలు ఎందుకు? మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి! -
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్.. ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేయండి చాలు! -
ఫైబర్, కాల్షియం వంటి పుష్కలంగా రాగి సమోసా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి -
ఇడ్లీ, దోశ, పెసరట్టు,అన్నం దేనికైనా అదిరిపోయే అల్లం మామిడి పచ్చడి..ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు! -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? హనీ ట్రాప్ ముఠాల వలలో పడితే జీవితమే నాశనం! -
బిర్యానీని మించిన రుచితో మటన్ కీమా రైస్.. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు! -
వృషభం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 20 నుండి 26 మే 2026 వరకు
తంజావూర్ స్పెషల్ రోజా పువ్వు చట్నీ..ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!..ఎలా చేసుకోవాలంటే..
ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు ప్లేట్లలోకి రాగానే నోరూరుతుంది. కానీ వాటి పక్కన రోజూ చూసే అదే కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఓసారి తమిళనాడులోని తంజావూర్ స్పెషల్ రోజూపువ్వు చట్నీ ట్రై చేసి చూడండి..అదిరిపోతుంది. దీని పేరు వినగానే ఇందులో గులాబీ రేకులు వేస్తారేమో అని కంగారు పడకండి.
ఈ చట్నీకి ఆ పేరు అది తయారయ్యాక కనిపించే అద్భుతమైన రోజూపువ్వు(లేత ఎరుపు) వల్ల వచ్చింది. చూపులకు ఆకర్షణీయంగా, నోటికి కమ్మగా తగిలే ఈ చట్నీని తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా ఈ చట్నీకి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం నాలుగు రోజుల పాటు అస్సలు పాడవదు. తంజావూర్ రోజా పువ్వు మిరపకాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు: 10
ఎండు మిరపకాయలు: 5
కాశ్మీరీ ఎండు మిరపకాయలు: 4
చింతపండు: కొద్దిగా
చిన్న టమాటో: 1
ఉప్పు: తగినంత
ఆవాలు: 1 టీస్పూన్
మినప పప్పు: 1 టీస్పూన్
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: ఒక రెమ్మ
తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు సగం వేగి, ఉడికిన తర్వాత మాత్రమే అందులో సాధారణ ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి వేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు మాడిపోకుండా ఉండి, చట్నీకి ఆకర్షణీయమైన ఎరుపు లేదా గులాబీ రంగు వస్తుంది.
-ఇప్పుడు అందులో తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలపండి. టమాటో ముక్కలు బాగా మెత్తబడి గుజ్జులా మారేంత వరకు సన్నని మంటపై వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, దానికి తగినంత ఉప్పు జోడించి బరకగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీలో 3 చెంచాల నువ్వుల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు వేసి చిటపటలాడనివ్వండి. చివరగా కరివేపాకు వేసి వేయించండి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులో వేసి బాగా కలపండి. సన్నని మంటపై సుమారు 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వండి. చట్నీ కాస్త చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి.
-అంతే కంటికి ఇంపుగా, నోటికి కమ్మగా ఉండే తంజావూర్ గులాబీ చట్నీ రెడీ. వేడి వేడి నెయ్యి ఇడ్లీలతో కానీ, పేపర్ లాంటి క్రిస్పీ దోసెలతో కానీ ఈ చట్నీని వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











