Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
పిండి రుబ్బే పనిలేదు,నానబెట్టే అవసరమే లేదు..10 నిమిషాల్లో హోటల్ స్టైల్ క్రిస్పీ రైస్ దోశ!
పప్పులు నానబెట్టాల్సిన పనిలేదు, పిండి పులియాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం ఇంట్లో ఉండే బియ్యం పిండితో, చిటికెలో హోటల్ స్టైల్ క్రిస్సీ దోశను రెడీ చేసుకోవచ్చు.
ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి వంటి వాటిని జోడించడం వల్ల ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.హోటల్ స్టైల్లో అప్పటికప్పుడు క్రిస్పీ రైస్ దోశ తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి: 1 కప్పు
బొంబాయి రవ్వ (సుజీ): 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు: 2-3 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తురుము: 2-3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 2-3
జీలకర్ర: 1 టీస్పూన్
మిరియాల పొడి: 1 టీస్పూన్
కరివేపాకు: 5-6 రెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: దోశలు కాల్చడానికి సరిపడా
నీళ్లు: పిండి కలపడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి. అందులో ఒక కప్పు బియ్యం పిండిని వేయండి. ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మృదువుగా ఉండేలా చూసుకోండి.
-సిద్ధం చేసుకున్న పిండిలో 1 టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు,కొత్తిమీర వేయాలి. వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి కలపండి.
-రైస్ దోశ ఎప్పుడూ పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తుంది. కాబట్టి ఈ మిశ్రమంలో సుమారు రెండు కప్పుల నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత దీనికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కలపండి. ఈ రవ్వ వల్ల దోశకు మంచి రంగు,కరకరలాడే గుణం వస్తుంది.
-స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టండి. పెనం బాగా వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచండి. పిండిని గరిటెతో తీసుకుని పెనం అంచుల నుండి మధ్యలోకి వచ్చేలా పోయాలి (సాధారణ దోశలా రుద్దకూడదు). ఇలా చేయడం వల్ల దోశలో చిన్న చిన్న రంధ్రాలు వచ్చి బాగా కాలుతుంది. దోశ చుట్టూ, మధ్యలో కొద్దిగా నూనె వేయండి.
-దోశ ఒక వైపు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా తయారయ్యాక రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చుకోండి. అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి క్రిస్పీ రైస్ దోశ రెడీ.
-దీనిని పల్లీల చట్నీ లేదా తాజా కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. సాయంత్రం వేళ పిల్లలకు, పెద్దలకు ఇది ఒక పర్ఫెక్ట్, లైట్ వెయిట్ స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications