Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్పాక్..బయట క్రిస్పీగా,లోపల మెత్తగా..సగ్గుబియ్యం కట్ లెట్ ఎలా చేసుకోవాలంటే
మన వంటగదుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. దీనిని సాధారణంగా పాయసం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యంతో కిచిడీ సహా అనేక వెరైటీ వంటకాలు కూడా తయారుచేస్తుంటారు. అయితే సగ్గుబియ్యం టిక్కీ ఎప్పుడైనా తిన్నారా? మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్. దీనిని తెలుగులో సగ్గుబియ్యం వడ లేదా సబ్బుబియ్యం కట్ లెట్ అని కూడా పిలుస్తారు. ఈ టిక్కీని సాధారణంగా ఉపవాసాల కోసం తయారు చేస్తారు. సగ్గుబియ్యం, బంగాళాదుంపలు,కొన్ని కారంగా ఉండే మసాలా దినుసుల రుచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు దీన్ని మీకు కావలసినప్పుడు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని పార్టీ స్నాక్ గా లేదా సాయంత్రం టీతో కూడా చేసుకోవచ్చు.
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ టిక్కీ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఈ టిక్కీని సాధారణంగా తవా మీద వేయించి తీసుకుంటారు, కానీ మీకు కావాలంటే మీరు దానిని కడాయిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కరకరలాడే, రుచికరమైన ఏదైనా తినాలని కోరుకుంటే తప్పకుండా సగ్గుబియ్యం టిక్కీని ప్రయత్నించండి. ఈ రుచికరమైన టిక్కీని ఇంట్లో సులభంగా తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం- 1/2 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - 3
అల్లం తురుము- 3 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచి ప్రకారం
మొక్కజొన్న పిండి - 1 టీస్పూన్
వేయించిన వేరుశనగ పప్పు - 6 టేబుల్ స్పూన్లు
నూనె-వేయించడానికి సరిపడా
సగ్గుబియ్యం టిక్కీ తయారీ విధానం
-సగ్గుబియ్యంను జల్లెడలో తీసుకుని నీటితో బాగా కడగాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో సగ్గుబియ్యంను అర కప్పు నీటిలో దాదాపు 6-8 గంటలు నాననివ్వండి.
-తర్వాత నానిన సగ్గుబియ్యం తీసుకొని వాటిని గుజ్జు చేయండి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. ఇందులోనే నానబెట్టి మెత్తగా గుజ్జు చేసిన సగ్గుబియ్యం కూడా వేసి మొత్తం కలిసేలా కలపండి. ఇందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి వేయండి.
-అందులోనే తెల్ల నువ్వులు, ఉప్పువేసి బాగా కలిపి, వాటిని పిండిలాంటి స్థిరత్వం వచ్చేలా చేయాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వేరుశెనగ పప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి, రెండు అరచేతుల మధ్య సున్నితంగా నొక్కడం ద్వారా వాటిని చదును చేయండి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయండి. వేడెక్కిన ఆయిల్ లో ఈ టిక్కీలను వేసి వేయించాలి. వాటిని గరిటతో మార్చుతూ వేయించుకుంటూ ఉండండి.
-రెండు వైపులా లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, గ్యాస్ ఆపివేసి, టిక్కీలను ప్లేట్ మీద ఉంచండి. అంతే సగ్గుబియ్యం టిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












