Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
రెస్టారెంట్ స్టైల్ ఆలు ఫ్రై ఇంట్లోనే..ఆ పొడి కలిపి ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
మనం సాధారణంగా ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన బంగాళాదుంప వేపుడు లేదా కుర్మా చేస్తుంటాం. ఈసారి కాస్త వెరైటీగా, రెస్టారెంట్ స్టైల్ కంటే అద్భుతమైన రుచితో బంగాళాదుంప ఫ్రైని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
ఒక స్పెషల్ మసాలా పొడి..సాధారణ బంగాళదుంప ఫ్రై కూర రుచిని వేరే లెవల్ కి తీసుకెళ్తుంది. చూస్తేనే నోరూరించే ఈ స్పెషల్ బంగాళాదుంప మసాలా ఫ్రై తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
నూనె -1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -5
ఎండు మిరపకాయలు - 2
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు లేదా కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
బంగాళాదుంపలు - 2
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు -అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసేయాలి. వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉంటే వేపుడు బాగా వస్తుంది.
-స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్లు వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడే కూరకి అసలైన రుచిని ఇస్తుంది.
-అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడనీయాలి. మినపప్పు బంగారు రంగులోకి వచ్చాక కూర రుచి బాగుంటుంది.
-తాలింపు వేగాక ముందుగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేయాలి. ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు చల్లి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం లో పెట్టి 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆవిరికి ముక్క మెత్తబడుతుంది.
-బంగాళాదుంప ముక్కలు 80శాతం ఉడికిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల మసాలా పొడిని ముక్కల పైన చల్లాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలపాలి.
-ఇప్పుడు మూత పెట్టకుండా మరో 2 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. ఇలా చేయడం వల్ల ముక్క క్రిస్పీగా మారుతుంది. అంతే గుమగుమలాడే స్పెషల్ పల్లీ కారం బంగాళాదుంప ఫ్రై రెడీ.
-సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్ గా ఇది సూపర్ కాంబినేషన్. ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే దీనికి మించిన రుచి మరొకటి ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












