Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
నోరూరించే మష్రూమ్ పరాఠా..తింటూనే బరువు తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే..
పరాఠా అంటే ఇష్టమా? కానీ బరువు పెరుగుతామన్న భయంతో దానికి దూరంగా ఉంటున్నారా? అయితే ఇకపై మీకిష్టమైన పరాఠాను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మామూలు పరాఠాలకు బదులుగా పోషకాల గని అయిన మష్రూమ్ పరాఠాను ప్రయత్నించి చూడండి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మష్రూమ్ పరాఠా ఒక వరంలాంటిది. సాధారణంగా పరాఠాలు కేలరీలతో నిండి ఉంటాయి, కానీ ఈ పరాఠా అందుకు పూర్తి భిన్నం. పుట్టగొడుగులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పరాఠాను అల్పాహారంలో తీసుకుంటే, రోజంతా కావాల్సిన శక్తి లభించి, మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. నోరూరించే మష్రూమ్ పరాఠా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
పుట్టగొడుగులు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం-వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కారం - పావు టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
ఓట్స్ పొడి లేదా శనగపిండి - 1 టేబుల్ స్పూన్
ఆలివ్ నూనె లేదా దేశీ నెయ్యి - కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ తీసుకొని, అందులో అర టీస్పూన్ నూనె వేడి చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పుట్టగొడుగులను వేసి వాటిలోని నీరంతా ఆవిరైపోయి పొడిగా అయ్యేవరకు సుమారు 4-5 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి పాన్ లోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, ఓట్స్ పొడి లేదా శనగపిండి వేసి కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మరింత మృదువుగా రావడానికి కొద్దిగా పెరుగు కూడా కలుపుకోవచ్చు.
-కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను తీసుకొని చిన్న పూరీలా వత్తి, మధ్యలో 1-2 స్పూన్ల పుట్టగొడుగుల స్టఫింగ్ పెట్టండి. అంచులను దగ్గరకు తెచ్చి జాగ్రత్తగా మూసివేసి పొడి పిండి చల్లుకుంటూ నిదానంగా పరాఠాలా వత్తండి.
-తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం వేడి చేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి. పరాఠాను పెనంపై వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే నోరూరించి మష్రూమ్ పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









