Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Godavari special fish curry: తిన్న కొద్దీ తినాలనిపించే గోదావరి విలేజ్ స్టైల్ 'చేపల పులుసు'..ఇలా చేసుకోవాలి
చేపల పులుసు అంటే కొంతమందికి పోయే ప్రాణం కూడా లేచి వస్తది. చేపల పులుసు తినాలని తహతహలాడిపోతుంటారు కొందరు. అయితే చేపల పులుసు ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్ లో చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలుగా చేపల పులుసుని వండుతారు. అయితే గోదావరి జిల్లాల్లో పల్లెటూర్లలో వండే చేపల పులుసు టేస్ట్ మిగతా వేటికి రాదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తినే కొద్దీ తినాలనిస్తుంటది..ముక్క ముక్కలో మజా వస్తుంది. గోదావరి విలేజ్ స్టైల్ లో చేపల పులుసు మీ ఇంట్లో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
గోదావరి విలేజ్ స్టైల్ లో చేపల పులుసు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-బొచ్చె చేపలు
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయ
-టమాటో
-చింతపండు
-ఆయిల్
-మెంతులు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ధనియాలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-లవంగాలు
-మిరియాలు
-ధనియాలు
-దాల్చిన చెక్క
తయారీ విధానం
-ముందుగా 1 కేజీ బొచ్చె చేపలను ముక్కలుగా కట్ చేసి ఓ గిన్నెలో వేసి అందులో 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ పసుపు వేసి అన్నీ ముక్కలకు కలిసేలా కలిపి మూతపెట్టేసి 30 నిమిషాల పాటు ఆ గిన్నె పక్కనపెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో మీడియం సైజ్ లో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు,2 స్పూన్ల ధనియాలు వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు టమాటో సైజు అంత చింతపండుని 15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీస్పూన్ మెంతులు, మిక్సీలో వేసి చేసిన మిశ్రమాన్ని వేసి మీడియం ప్లేమ్ మీద 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి.
-తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచండి.
-తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఉండండి. అడుగు అంటడం స్టార్ట్ అయ్యాక ఇందులో అర టీ స్పూన్ పసుపు,రుచికి సరిపడా ఉప్పు,2 టీస్పూన్ల కారం వేసి మంటను లో ప్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి.
-తర్వాత మిక్సీలో 3 టమాటోలు వేసి గుజ్జుగా చేసి అది ఈ పాన్ లో వేసి కలిపి మూతపెట్టేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 10 పచ్చిమిర్చి,చేప ముక్కలు వేసి మూతపెట్టేయండి.
-3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో నానబెట్టిన చింతపండు రసం,1 లీటర్ నీళ్లు పోసేసి మూతపెట్టేయండి. మంటను హై ప్లేమ్ లో పెట్టి అరగంట పాటు పాటు ఉడకనివ్వండి.
-ఈ సమయంలో మిక్సీలో లేదా రోట్లో 4 యాలకులు, 1 టీస్పూన్ మిరియాలు,5 లవంగాలు,1 ఇంచు చెక్కమిక్సీలో వేసి మెత్తగా దంచి ఆ పొడిని చేపలలో వేసి గరిట పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని ఆ గిన్నెను అటు ఇటూ కదిలించి మూత పెట్టేయండి.
-కొద్దిసేపటి తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చేపల పులుసు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో అయినా లేదా చద్దన్నంలో అయినా కలుపుకొని తింటే మాటల్లో చెప్పలేని మజా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












