Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Energy Kheer: టీ,కాఫీ బదులు ఇది 1 కప్పు తాగితే చాలు..జన్మలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..ఎలా చేసుకోవాలంటే
టీ, కాఫీ రోజులో ఒక్కసారైనా తాగకపోతే చాలామందికి పొద్దుపోదు. అయితే మనం రోజూ తాగే టీ,కాఫీలకు ఓ కప్పు సగ్గుబియ్యం మఖానా ఖీర్ తాగి చూడండి.. మీ శరీరంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. సగ్గుబియ్యం మఖానా పాయసం అనేది రుచికరమైన, పోషకమైన స్వీట్. ఇది తక్కువ సమయంలో తయారుచేయడానికి వీలవుతుంది, ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అల్పాహారంగా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం, మఖానా రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల ఈ పాయసం ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. ఎంటిత నీరసాన్నైనా తగ్గించి సత్తువనిస్తుంది ఈ పాయసం. నొప్పులను కూడా మాయం చేస్తుంది. ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అందించే సగ్గుబియ్యం మఖానా పాయసం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బెల్లం
-సగ్గుబియ్యం
-మఖానా
-బాదంపప్పు
-పిస్తాపప్పు
-నెయ్యి
-యాలకలు
-కుంకుమ పువ్వు
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీ విధానం
-ముందుగా పెద్ద సైజులో ఉండే అరకప్పు సగ్గుబియ్యం కనీసం 2 గంటలు నీళ్లలో నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు తురిమిన బెల్లం వేసి,ఇందులోనే పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత 1 నిమిషం వేడి చేసా గిన్నెను పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్తి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక 1 కప్పు పూల్ మఖానా వేసి ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఓ ఫ్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే మూడున్నర కప్పుల పాలు(750 ml) పోసి అవి పొంగువచ్చేదాకా మరిగించుకోవాలి.
-పాలు మరగడం ప్రారంభమయ్యాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలపండి. ఇందులో కొంచెం కుంకుమ్మ పువ్వు కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి
-ఇదే సమయంలో ఓ మిక్సీ గిన్నెలో 10 బాదంపప్పులు, 1 టీస్పూన్ పిస్తా పప్పు, 4 యాలకలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బాదం పిస్తా పొడిని వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించాక ఇందులో సన్నగా తరిగిన 5 బాదంపప్పు ముక్కలు,ఫ్రై చేసి ఉంచిన పూల్ మఖానా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలో ముందుగా తయారుచేసుకున్న బెల్లం సిరప్ ని వడకట్టి పోసి బాగా కలపండి. అంతే టేస్టీ సగ్గుబియ్యం మఖానా ఖీర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








