Healthy breakfast: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కు ఇది చాలు..ఈ దోశ తింటే డాక్టర్ అవసరం లేదు,ఎలా చేయాలంటే

Posted By:

ప్రస్తుతం అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఆహారమే మిల్లెట్స్. ఇవి పోషకాలతో నిండి ఉండి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. మిల్లెట్స్‌ తో తయారుచేసే దోశలు రుచికరమైన అల్పాహారంగా లేదా భోజనంగా తీసుకోవడానికి చక్కగా ఉంటాయి.

పొద్దున్నే గోధుమలు, బియ్యంతో చేసే దోశలు తినడం కన్నా మిల్లెట్స్ తో చేసే దోశలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మిల్లెట్ దోశలు వివిధ రకాల మిల్లెట్స్‌తో తయారుచేయవచ్చు. ఇక్కడ మనం సాధారణంగా ఉపయోగించే కొన్ని మిల్లెట్స్‌ తో దోశ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.


మిల్లెట్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు

మీకు అందుబాటులో ఉన్న ఏవైనా రెండు లేదా మూడు రకాల మిల్లెట్స్ తీసుకోవచ్చు.

సజ్జలు - 1 కప్పు
జొన్నలు - 1 కప్పు
రాగులు - 1 కప్పు
కొర్రలు - 1 కప్పు
ఊదలు - 1 కప్పు
అరికలు- 1 కప్పు
మినపప్పు - 1/2 కప్పు
మెంతులు - 1/2 టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - దోశలు వేయడానికి తగినంత
నీరు - పిండి రుబ్బుకోవడానికి తగినంత

రాముడి కాలం నాటి బ్రేక్ ఫాస్ట్..తింటే 100 ఏళ్లు గ్యారెంటీ,ఎలా చేయాలంటే..

మిల్లెట్ దోశ తయారీ విధానం

ముందుగా మిల్లెట్స్, మినపప్పును ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కడగాలి.

కడిగిన మిల్లెట్స్, మినపప్పులో మెంతులు వేసి తగినంత నీరు పోసి కనీసం 4-6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి.

నానిన మిల్లెట్స్, మినపప్పు, మెంతులను మిక్సీ జార్ లేదా గ్రైండర్‌ లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. దోశ పిండికి కావలసినంత చిక్కగా ఉండాలి.

రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసి ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత గిన్నెను మూతపెట్టి 8-10 గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి.

పిండి బాగా పులిసిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీరు కలిపి పిండి యొక్క చిక్కదనాన్ని సరిచేసుకోవచ్చు.

ఇప్పుడు దోశలు వేయడానికి పెనంను స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంగా ఉంచాలి.

పెనం మీద కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పలుచగా రుద్దాలి.

దోశ చుట్టూ, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మీడియం మంటపై దోశ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి.

ఒకవైపు బాగా కాలిన తర్వాత, రెండోవైపు కూడా కొద్దిగా కాల్చుకోవచ్చు.

కాలిన దోశను ప్లేట్‌లోకి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీ లేదా సాంబార్‌తో వేడి వేడిగా తింటే అద్భుతమే.

[ of 5 - Users]
Story first published: Sunday, April 6, 2025, 21:34 [IST]
Desktop Bottom Promotion